BigTV English
Advertisement

Viveka Murder Case: అవినాష్ నిందితుడే.. జగన్‌కు ముందే తెలుసు.. సీబీఐ కౌంటర్..

Viveka Murder Case: అవినాష్ నిందితుడే.. జగన్‌కు ముందే తెలుసు.. సీబీఐ కౌంటర్..
avinash jagan viveka

Avinash Reddy Latest News(AP breaking news today): ముందస్తు బెయిల్ వచ్చిన సంతోషం అవినాష్‌రెడ్డికి లేకుండా చేస్తోంది సీబీఐ. అరెస్ట్ నుంచి తప్పించుకున్నా.. కేసు ఉచ్చు నుంచి అంత ఈజీగా బయటపడే పరిస్థితి లేదు. ఇన్నాళ్లూ అవినాష్‌ను సహానిందితుడు, సాక్షిగా చెప్పిన సీబీఐ.. లేటెస్ట్‌గా హైకోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో ఏకంగా ఏ8 నిందితుడిగా చేర్చడం కలకలం రేపుతోంది. ఇదే కౌంటర్‌లో మరోసారి సీఎం జగన్ ప్రస్తావన కూడా తీసుకురావడం పొలిటికల్ అటెన్షన్ క్రియేట్ చేస్తోంది.


వివేకా మర్డర్ కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డి వేసిన బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది. అయితే, భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వొద్దంటూ జూన్ 5న సీబీఐ ఫైల్ చేసిన కౌంటర్‌లో అవినాష్‌రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చింది.

వివేకా హత్యకు కుట్ర చేయడం, సాక్ష్యాలను చెరిపి వేయడంలో.. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిల ప్రమేయం ఉందని.. అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని సీబీఐ తెలిపింది. సాక్షులను ప్రభావితం చేసేందుకు వారిద్దరు ప్రయత్నిస్తున్నారని చెప్పింది.


వివేకా మర్డర్ గురించి సీఎం జగన్‌కు ఉదయం 6.15కంటే ముందే తెలుసని సీబీఐ తన కౌంటర్లో ప్రస్తావించింది. హత్య గురించి మొదట చెప్పారని అంటున్న వివేకా పీఏ కంటే ముందే.. జగన్‌కు ఆ విషయం తెలుసని తమ దర్యాప్తులో గుర్తించామని సీబీఐ స్పష్టం చేసింది.

భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ ఇస్తే దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేస్తారని.. అతన్ని అరెస్టు చేసినప్పుడు కడపలో జరిగిన ధర్నాలు, ర్యాలీలే భాస్కర్‌రెడ్డి బలానికి నిదర్శనమని సీబీఐ తెలిపింది.

శివశంకర్‌రెడ్డి ఫోన్‌ చేసిన నిమిషంలోనే అవినాష్‌రెడ్డి హత్యా స్థలానికి చేరుకున్నారని.. ఉదయం 5.20కి ముందే అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డితో.. గంగిరెడ్డి మాట్లాడారని సీబీఐ తన కౌంటర్లో ప్రస్తావించింది.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×