E-Paper
Advertisement

Gupta Nidhulu: గుప్త నిధుల కోసం.. దేవతల గుట్టపై కలకలం..

Gupta Nidhulu: గుప్త నిధుల కోసం.. దేవతల గుట్టపై కలకలం..
gupta nidhulu

Latest news in Telangana: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామంలో గుప్త నిధుల కలకలం రేపింది. దేవతల గుట్టపై వెలసిన భైరవుని విగ్రహాన్ని దొంగలించేందుకు యత్నించి విఫలమయ్యారు దుండగులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దేవతల గుట్టపైకి రాత్రి సమయాల్లో దేవతలు వచ్చి వెళ్తుంటారని స్థానికుల విశ్వాసం. గుట్టపైకి ఎవరైనా వెళితే తిరిగిరారని చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారంలో ఉండటంతో ఇంతకాలం ఈ గుట్టపైకి ఎవరు వెళ్లే సాహసం చేయలేదు. దీన్నే అదునుగా చేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు భైరవుడి విగ్రహాన్ని దొంగలించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అక్కడ గుప్తనిధులు ఉన్నాయని తవ్వే ప్రయత్నం చేశారు.

సుమారు 8 అడుగులు ఉండే బరువైన విగ్రహాన్ని కదిలించే ప్రయత్నం చేశారు. 3వేల సంవత్సరాల క్రితం నాటి ఆనవాళ్లు కలిగిన ఈ గుట్టపై గుప్త నిధులు ఉన్నాయని భావించిన దుండగులు తవ్వకాలను మొదలుపెట్టి విఫలమయ్యారు. కాకతీయుల కాలం నాటి తమ గ్రామ చరిత్రను నాశనం చేసేందుకు ప్రయత్నించిన దుండగులను వెంటనే శిక్షించాలని పోలీసులను గ్రామస్తులు కోరుతున్నారు.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×