E-Paper
Advertisement

Durga temple: దుర్గగుడిలో అదే పరిస్థితి.. ప్రభుత్వం సీరియస్..

Durga temple: దుర్గగుడిలో అదే పరిస్థితి.. ప్రభుత్వం సీరియస్..
Advertisement

Durga temple: తిరుమల లడ్డూ వివాదం ముగియక ముందే దుర్గ టెంపుల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దుర్గగుడిలో నాసిరకం సరుకులపై వినియోగించడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రస్తుతం అంతర్గత విచారణ జరుగుతోంది.

వైసీపీ హయాంలో చేసిన పనులు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోట్లాది మంది భక్తులు వచ్చే దేవాలయాల్లో ప్రసాదాలు నాసిరకంగా ఉండడంపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది.

Advertisement

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నాసిరకం సరుకుల వ్యవహారంపై దేవాదాయ శాఖలో అంతర్గత విచారణ జరుగుతోంది. రెండురోజుల తనిఖీల్లో రూ. 15 లక్షల రూపాయల విలువైన నాసిరకం సరుకులు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ముఖ్యంగా అన్నదానం, లడ్డూ ప్రసాదం, స్టోర్స్‌లో పని చేస్తున్న ఉద్యోగుల పాత్రపై నివేదిక రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఎఫ్‌ఎస్ఎస్ఏఐ ప్రమాణాలు పాటించకపోవడంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఉద్యోగులు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనే దానిపై ఆరా తీస్తోంది. మరో నాలుగైదు రోజుల్లో రిపోర్టు ఆ శాఖ అందనుంది. ఆ తర్వాత విజిలెన్స్ విచారణ చేయిస్తుందా? అనేది తెలియాల్సివుంది.

Advertisement

ALSO READ: ఆంధ్రప్రదేశ్ లో బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్.. ఈ నెల 28,29 తేదీల్లో.. వివరాలు ఇవిగో

ఇదేకాకుండా అటు అన్నవరం, సింహాచలం దేవాలయాల్లో ఇదే సమస్య తలెత్తినట్టు వార్తలు వస్తున్నాయి. తిరుమల లడ్డూ వ్యవహారం వెలుగులోకి రాగానే అన్నవరం దేవాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే సందర్శించారు. నెయ్యిను తనిఖీకి పంపించారు. దానిపై రెండురోజుల్లో నివేదిక రానుంది. మొత్తానికి ఏపీ వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రక్షాళన జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో ఇంకెంత మంది పేర్లు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×