BigTV English
Advertisement

Durga temple: దుర్గగుడిలో అదే పరిస్థితి.. ప్రభుత్వం సీరియస్..

Durga temple: దుర్గగుడిలో అదే పరిస్థితి.. ప్రభుత్వం సీరియస్..

Durga temple: తిరుమల లడ్డూ వివాదం ముగియక ముందే దుర్గ టెంపుల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దుర్గగుడిలో నాసిరకం సరుకులపై వినియోగించడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రస్తుతం అంతర్గత విచారణ జరుగుతోంది.


వైసీపీ హయాంలో చేసిన పనులు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోట్లాది మంది భక్తులు వచ్చే దేవాలయాల్లో ప్రసాదాలు నాసిరకంగా ఉండడంపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నాసిరకం సరుకుల వ్యవహారంపై దేవాదాయ శాఖలో అంతర్గత విచారణ జరుగుతోంది. రెండురోజుల తనిఖీల్లో రూ. 15 లక్షల రూపాయల విలువైన నాసిరకం సరుకులు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ముఖ్యంగా అన్నదానం, లడ్డూ ప్రసాదం, స్టోర్స్‌లో పని చేస్తున్న ఉద్యోగుల పాత్రపై నివేదిక రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.


ఎఫ్‌ఎస్ఎస్ఏఐ ప్రమాణాలు పాటించకపోవడంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఉద్యోగులు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనే దానిపై ఆరా తీస్తోంది. మరో నాలుగైదు రోజుల్లో రిపోర్టు ఆ శాఖ అందనుంది. ఆ తర్వాత విజిలెన్స్ విచారణ చేయిస్తుందా? అనేది తెలియాల్సివుంది.

ALSO READ: ఆంధ్రప్రదేశ్ లో బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్.. ఈ నెల 28,29 తేదీల్లో.. వివరాలు ఇవిగో

ఇదేకాకుండా అటు అన్నవరం, సింహాచలం దేవాలయాల్లో ఇదే సమస్య తలెత్తినట్టు వార్తలు వస్తున్నాయి. తిరుమల లడ్డూ వ్యవహారం వెలుగులోకి రాగానే అన్నవరం దేవాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే సందర్శించారు. నెయ్యిను తనిఖీకి పంపించారు. దానిపై రెండురోజుల్లో నివేదిక రానుంది. మొత్తానికి ఏపీ వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రక్షాళన జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో ఇంకెంత మంది పేర్లు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Big Stories

×