E-Paper
Advertisement

CM Chandrababu: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.400 కోట్లు విరాళం ఓ చరిత్ర.. చంద్రబాబు వెల్లడి

CM Chandrababu: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.400 కోట్లు విరాళం ఓ చరిత్ర.. చంద్రబాబు వెల్లడి
Advertisement

CM Chandrababu Meet in NTR Dist: సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు విరాళంగా రావడం చరిత్ర అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడ్డామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి వరద బాధితులకు సహాయం అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలు పెద్ద మొత్తంలో స్పందించారని, భారీగా విరాళాలు ప్రకటించారన్నారు.. వరద సమయంలో అందరం సమన్వయంతో పనిచేశామన్నారు. అధికారులతో పాటు నేను కూడా బురదలో దిగినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Advertisement

వరదల సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో పెద్ద విపత్తు జరిగిన సమయంలో అందరూ ఏకతాటిపైకి రావడం హర్షణీయమన్నారు. ఒకవైపు నుంచి వరద ఉప్పొంగి వస్తుండగా.. మరోవైపు నుంచి బుడమేరు నీరు పోటెత్తిందన్నారు. ఈ సమయంలో అధికారులతో పాటు తాను స్వయంగా పర్యటించానని వెల్లడించారు.

చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 42సెం.మీల వర్షం పడిందని చంద్రబాబు చెప్పారు. దీంతోపాటు ఊహించని రీతిలో బుడమేరు వరద ముంచెత్తిందని వెల్లడించారు. గత పాలకులు చేసిన పాపాలు శాపాలుగా మారాయని చంద్రబాబు విమర్శలు చేశారు. గత ప్రభుత్వం గండ్లు పూడ్చకపోవడంతో వరద వచ్చిందన్నారు. అక్రమ కట్టడాలు కూడా వరదలకు కారణమని చెప్పారు.

Advertisement

Also Read: దుర్గగుడిలో అదే పరిస్థితి.. ప్రభుత్వం సీరియస్..

ప్రజల్లో మనోధైర్యం నింపామని వెల్లడించారు. సుమారు 4 లక్షల మందికి 602కోట్లు నేరుగా బాధితుల ఖాతాల్లోకి విడుదల చేశామని చెప్పారు. వరదల్లో 7వేల 600 కోట్ల నష్టం జరిగిందన్నారు. సమస్య తీవ్రంగా ఉందని, నేను ప్రజల్లోనే ఉన్నానని చెప్పారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×