BigTV English
Advertisement

CM Chandrababu: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.400 కోట్లు విరాళం ఓ చరిత్ర.. చంద్రబాబు వెల్లడి

CM Chandrababu: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.400 కోట్లు విరాళం ఓ చరిత్ర.. చంద్రబాబు వెల్లడి

CM Chandrababu Meet in NTR Dist: సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు విరాళంగా రావడం చరిత్ర అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడ్డామని చెప్పారు.


రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి వరద బాధితులకు సహాయం అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలు పెద్ద మొత్తంలో స్పందించారని, భారీగా విరాళాలు ప్రకటించారన్నారు.. వరద సమయంలో అందరం సమన్వయంతో పనిచేశామన్నారు. అధికారులతో పాటు నేను కూడా బురదలో దిగినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు.

వరదల సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో పెద్ద విపత్తు జరిగిన సమయంలో అందరూ ఏకతాటిపైకి రావడం హర్షణీయమన్నారు. ఒకవైపు నుంచి వరద ఉప్పొంగి వస్తుండగా.. మరోవైపు నుంచి బుడమేరు నీరు పోటెత్తిందన్నారు. ఈ సమయంలో అధికారులతో పాటు తాను స్వయంగా పర్యటించానని వెల్లడించారు.


చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 42సెం.మీల వర్షం పడిందని చంద్రబాబు చెప్పారు. దీంతోపాటు ఊహించని రీతిలో బుడమేరు వరద ముంచెత్తిందని వెల్లడించారు. గత పాలకులు చేసిన పాపాలు శాపాలుగా మారాయని చంద్రబాబు విమర్శలు చేశారు. గత ప్రభుత్వం గండ్లు పూడ్చకపోవడంతో వరద వచ్చిందన్నారు. అక్రమ కట్టడాలు కూడా వరదలకు కారణమని చెప్పారు.

Also Read: దుర్గగుడిలో అదే పరిస్థితి.. ప్రభుత్వం సీరియస్..

ప్రజల్లో మనోధైర్యం నింపామని వెల్లడించారు. సుమారు 4 లక్షల మందికి 602కోట్లు నేరుగా బాధితుల ఖాతాల్లోకి విడుదల చేశామని చెప్పారు. వరదల్లో 7వేల 600 కోట్ల నష్టం జరిగిందన్నారు. సమస్య తీవ్రంగా ఉందని, నేను ప్రజల్లోనే ఉన్నానని చెప్పారు.

Related News

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Big Stories

×