E-Paper
Advertisement

CM Chandrababu: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.400 కోట్లు విరాళం ఓ చరిత్ర.. చంద్రబాబు వెల్లడి

CM Chandrababu: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.400 కోట్లు విరాళం ఓ చరిత్ర.. చంద్రబాబు వెల్లడి
Advertisement

CM Chandrababu Meet in NTR Dist: సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు విరాళంగా రావడం చరిత్ర అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడ్డామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి వరద బాధితులకు సహాయం అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలు పెద్ద మొత్తంలో స్పందించారని, భారీగా విరాళాలు ప్రకటించారన్నారు.. వరద సమయంలో అందరం సమన్వయంతో పనిచేశామన్నారు. అధికారులతో పాటు నేను కూడా బురదలో దిగినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Advertisement

వరదల సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో పెద్ద విపత్తు జరిగిన సమయంలో అందరూ ఏకతాటిపైకి రావడం హర్షణీయమన్నారు. ఒకవైపు నుంచి వరద ఉప్పొంగి వస్తుండగా.. మరోవైపు నుంచి బుడమేరు నీరు పోటెత్తిందన్నారు. ఈ సమయంలో అధికారులతో పాటు తాను స్వయంగా పర్యటించానని వెల్లడించారు.

చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 42సెం.మీల వర్షం పడిందని చంద్రబాబు చెప్పారు. దీంతోపాటు ఊహించని రీతిలో బుడమేరు వరద ముంచెత్తిందని వెల్లడించారు. గత పాలకులు చేసిన పాపాలు శాపాలుగా మారాయని చంద్రబాబు విమర్శలు చేశారు. గత ప్రభుత్వం గండ్లు పూడ్చకపోవడంతో వరద వచ్చిందన్నారు. అక్రమ కట్టడాలు కూడా వరదలకు కారణమని చెప్పారు.

Advertisement

Also Read: దుర్గగుడిలో అదే పరిస్థితి.. ప్రభుత్వం సీరియస్..

ప్రజల్లో మనోధైర్యం నింపామని వెల్లడించారు. సుమారు 4 లక్షల మందికి 602కోట్లు నేరుగా బాధితుల ఖాతాల్లోకి విడుదల చేశామని చెప్పారు. వరదల్లో 7వేల 600 కోట్ల నష్టం జరిగిందన్నారు. సమస్య తీవ్రంగా ఉందని, నేను ప్రజల్లోనే ఉన్నానని చెప్పారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×