E-Paper
Advertisement

CM Chandrababu new advisors: చంద్రబాబు ప్రభుత్వంలో కొత్త సలహాదారులు, కాకపోతే..

CM Chandrababu new advisors: చంద్రబాబు ప్రభుత్వంలో కొత్త సలహాదారులు, కాకపోతే..

CM Chandrababu new advisors (AP political news) : చంద్రబాబునాయుడు కేబినెట్ కొలువు దీరింది. ప్రతి శాఖకు సమర్థు లైన అధికారులను నియమించుకున్నారు. మరికొందర్ని డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి రప్పించారు. కానీ ఎక్కడ సమస్య సీఎం చంద్రబాబును వెంటాడుతోంది. అదే సలహాదారుల సమస్య. సలహాదారులగా ఎవర్ని తీసుకోవాలనే దానిపై రకరకాల ఆలోచనలు. రాజకీయ నేతలను తీసుకుంటే వైసీపీ తరహాగా తయారవు తుందని భావిస్తున్నారు. దీంతో ఐఐఎం స్టూడెంట్స్‌పై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టినట్టు ప్రభుత్వ వర్గా లు చెబుతున్నాయి.

ఏ రాష్ట్రప్రభుత్వాలైనా  నార్మల్‌గా ఐఏఎస్ అధికారులపై ఆధారపడతాయి. ఒక్కోసారి ఆయా అధికారులు తీసుకున్న నిర్ణయాలు బూమరాంగ్ అవుతాయి. ప్రభుత్వానికి ఊహించని డ్యామేజ్ జరుగుతుంది. అలాంటి సందర్భాలు లేకపోలేదు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా కొంతమంది ఐఐఎం స్టూడెంట్స్ తీసు కోవాలని ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. మంత్రివర్గంలోని ప్రతీ మంత్రికి సహకరించేందుకు వీరి సేవల ను ఉపయోగించుకోవాలన్నది అసలు ప్లాన్.

ఐఐఎంల్లో చదివినవారిని తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారట సీఎం చంద్రబాబునాయుడు. వారికి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్‌గా ప్రతీ శాఖలో నియమించాలని భావిస్తున్నారు. మంత్రుల పేషీల్లో పని చేసే అధికారులకు పరిపాలన వ్యవహారాల్లో వీరంతా సహాయం చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదిన నియ మించుకోవాలన్నది ఆలోచన. సంబంధిత మంత్రి శాఖల సమస్యలను వీరు అధ్యయనం చేయనున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే ప్రజలకు మెరుగైన పాలనను అందించేలా సలహాలు సూచనలు ఇవ్వనున్నారు.

గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కొంతమంది ఐఐఎం విద్యార్థులను సలహాదారులుగా నియ మించుకున్న విషయం తెల్సిందే. ప్రభుత్వ పాలసీలపై వారికి అవగాహన ఉంటుంది. అవి ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా నిర్ణయాలు ఎలా తీసుకోవాలనే దానిపై వీరు దృష్టి సారించనున్నారు.

ALSO READ: మదనపల్లె ఫైల్స్ కేసు, పెద్దిరెడ్డి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు..

వైసీపీ ప్రభుత్వం చాలామందిని సలహాదారులను నియమించుకుంది. ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందు కు చాలామందికి సరైన అవగాహన లేదు. కనీసం కేబిన్ కూడా లేదు. వారంతా సచివాలయానికి వచ్చిన సందర్భాలు లేవు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం నుంచి ప్రతీ నెల లక్షల్లో జీతాలు తీసుకునేవారు. అందుకు భిన్నంగా పరిపాలనలో తన మార్క్ చూపించాలనే తనపతో ఉన్నారు సీఎం చంద్రబాబు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×