E-Paper
Advertisement

Chandrababu : సీఐడీ ఆఫీస్ కు చంద్రబాబు.. బెయిల్ పూచీకత్తు, బాండ్ సమర్పణ..

Chandrababu : సీఐడీ ఆఫీస్ కు చంద్రబాబు.. బెయిల్ పూచీకత్తు, బాండ్ సమర్పణ..
Advertisement

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. తొలుత హైదరాబాద్‌ నుంచి గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు టీడీపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా ఏపీ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లారు.

ఇటీవల ఇన్నర్‌ రింగ్ రోడ్డు (IRR), మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ఇటీవల ముందస్తు బెయిల్‌ మంజూరైంది. అదే సమయంలో దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు ఆయనను ఆదేశించింది. అలాగే వారం రోజుల లోపు రూ.లక్ష చొప్పున ఇద్దరు పూచీకత్తు ఇవ్వాలని నిర్దేశించింది. ఉచిత ఇసుక కేసులో సీఐడీ అధికారులకు పూచీకత్తు, బాండ్‌ ను చంద్రబాబు సమర్పించారు. ఐఆర్‌ఆర్‌ కేసులో కుంచనపల్లి, మద్యం కేసులో గుంటూరు సీఐడీ కార్యాలయాలకు వెళ్లి పూచీకత్తు, బాండ్లు సమర్పిస్తారు.

Advertisement

విజయవాడ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు వస్తున్నారనే విషయం తెలియగానే పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా అక్కడకు చేరుకున్నారు. ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.

.

Advertisement

.

Related News

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×