E-Paper
Advertisement

Chandrababu : సీఐడీ ఆఫీస్ కు చంద్రబాబు.. బెయిల్ పూచీకత్తు, బాండ్ సమర్పణ..

Chandrababu : సీఐడీ ఆఫీస్ కు చంద్రబాబు.. బెయిల్ పూచీకత్తు, బాండ్ సమర్పణ..
Advertisement

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. తొలుత హైదరాబాద్‌ నుంచి గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు టీడీపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా ఏపీ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లారు.

ఇటీవల ఇన్నర్‌ రింగ్ రోడ్డు (IRR), మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ఇటీవల ముందస్తు బెయిల్‌ మంజూరైంది. అదే సమయంలో దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు ఆయనను ఆదేశించింది. అలాగే వారం రోజుల లోపు రూ.లక్ష చొప్పున ఇద్దరు పూచీకత్తు ఇవ్వాలని నిర్దేశించింది. ఉచిత ఇసుక కేసులో సీఐడీ అధికారులకు పూచీకత్తు, బాండ్‌ ను చంద్రబాబు సమర్పించారు. ఐఆర్‌ఆర్‌ కేసులో కుంచనపల్లి, మద్యం కేసులో గుంటూరు సీఐడీ కార్యాలయాలకు వెళ్లి పూచీకత్తు, బాండ్లు సమర్పిస్తారు.

Advertisement

విజయవాడ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు వస్తున్నారనే విషయం తెలియగానే పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా అక్కడకు చేరుకున్నారు. ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.

.

Advertisement

.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×