E-Paper
Advertisement

Ganta Srinivasa Rao : సగం మంది ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెబుతారు.. గంటా జోస్యం..

Ganta Srinivasa Rao : సగం మంది  ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెబుతారు.. గంటా జోస్యం..
Advertisement

Ganta Srinivasa Rao : మునిగిపోతున్న నావలాంటి వైసీపీ నుంచి సురక్షితంగా బయటపడేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సమయంలో వైసీపీపై విమర్శలు గుప్పించారు.

‘‘ఎంపీలకు కూడా జగన్‌ కలిసే అవకాశం ఇవ్వడం లేదు. సీఎం జగన్ ను రెండుసార్లే కలిసినట్టు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్‌ చెప్పారు. పెనమలూరు సీనియర్ ఎమ్మెల్యే ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. అంబటి రాయుడు ఏవేవో ఊహించుకొని వైసీపీలోకి వెళ్లాడు. పరుగులు పెట్టకుండానే ఆయన బయటకు వచ్చేశారు. ఇప్పుడేమో జనసేనలో సీటు కోసం చూస్తున్నారు. ఎమ్మెల్యేల బదిలీలు ఇంత పెద్దఎత్తున ఎప్పుడూ జరగలేదు. 50 శాతం మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడే పరిస్థితి వచ్చింది. జనవరి 20న భీమిలి నుంచి జగన్‌ ప్రజాయాత్రలు ప్రారంభిస్తారట. ఆయనకు ప్రజల నుంచి ఛీత్కారాలు తప్పవు. ఉమ్మడి విశాఖలో ఒక్క స్థానంలో కూడా వైసీపీ గెలిచే అవకాశమే లేదు’’ అని గంటా శ్రీనివాసరావు చెప్పారు.

Related News

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×