E-Paper
Advertisement

Ganta Srinivasa Rao : సగం మంది ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెబుతారు.. గంటా జోస్యం..

Ganta Srinivasa Rao : సగం మంది  ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెబుతారు.. గంటా జోస్యం..
Advertisement

Ganta Srinivasa Rao : మునిగిపోతున్న నావలాంటి వైసీపీ నుంచి సురక్షితంగా బయటపడేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సమయంలో వైసీపీపై విమర్శలు గుప్పించారు.

‘‘ఎంపీలకు కూడా జగన్‌ కలిసే అవకాశం ఇవ్వడం లేదు. సీఎం జగన్ ను రెండుసార్లే కలిసినట్టు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్‌ చెప్పారు. పెనమలూరు సీనియర్ ఎమ్మెల్యే ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. అంబటి రాయుడు ఏవేవో ఊహించుకొని వైసీపీలోకి వెళ్లాడు. పరుగులు పెట్టకుండానే ఆయన బయటకు వచ్చేశారు. ఇప్పుడేమో జనసేనలో సీటు కోసం చూస్తున్నారు. ఎమ్మెల్యేల బదిలీలు ఇంత పెద్దఎత్తున ఎప్పుడూ జరగలేదు. 50 శాతం మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడే పరిస్థితి వచ్చింది. జనవరి 20న భీమిలి నుంచి జగన్‌ ప్రజాయాత్రలు ప్రారంభిస్తారట. ఆయనకు ప్రజల నుంచి ఛీత్కారాలు తప్పవు. ఉమ్మడి విశాఖలో ఒక్క స్థానంలో కూడా వైసీపీ గెలిచే అవకాశమే లేదు’’ అని గంటా శ్రీనివాసరావు చెప్పారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×