E-Paper
Advertisement

Chandrababu: లక్ష మెజార్టీ.. కుప్పంలో చంద్రబాబు క్లారిటీ..

Chandrababu: లక్ష మెజార్టీ.. కుప్పంలో చంద్రబాబు క్లారిటీ..
Advertisement
Chandrababu kuppam

Chandrababu naidu kuppam meeting(Political news in AP): వెనక బడిన ప్రాంతం కాబట్టే.. ఆనాడు తాను కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇక్కడి ప్రాంతాన్ని అభివృద్ధి చేశాననే సంతృప్తి ఉందన్నారు. వైసీపీ పాలనలో ప్రజలపై పన్నుల బాదుడు ఎక్కువైందని, సంక్షేమ పథకాలతో 10 రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేస్తున్నారని విమర్శించారు. ఇసుక బకాసురులతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు చంద్రబాబు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో ఏపీని నాశనం చేశారని.. ఈ ప్రభుత్వానికి ఇక ఆరు నెలలు మాత్రమే గడువుందని అన్నారు.

కుప్పంలో లక్ష మెజార్టీతో గెలుస్తానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కుప్పంలో రెండోరోజు పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కుప్పంను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానన్నారు. వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారని.. టీడీపీపై జరుగుతున్న రాజకీయ దాడులపై మండిపడ్డారు. ఎవరినీ వదిలిపెట్టనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.

Advertisement

ద్రవిడ యూనివర్సిటీ ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందన్నారు. ఉద్యోగులు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారని చెప్పారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మళ్లీ టీడీపీనే గెలవాలని పిలుపు ఇచ్చారు చంద్రబాబు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×