Big Stories

Chandrababu: ‘ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్’..

jagan video

Chandrababu: వైసీపీ ప్రభుత్వానికి నాలుగేళ్లు. మే 30. అధికారంలోకి వచ్చిన రోజు. పార్టీ శ్రేణులు ఘనంగా వేడుక చేసుకుంటున్నారు. సీఎం జగన్ దంపతులు అనాథ పిల్లలతో గడిపి ప్రత్యేకత చాటుకున్నారు. అధికార వైసీపీ ఇలా సంబురాలు చేసుకుంటుంటే.. ప్రతిపక్ష టీడీపీ జగన్ నాలుగేళ్ల పాలనపై విమర్శలతో మండిపడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్‌లో సెటైర్లు సంధించారు.

- Advertisement -

వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేతకు ఆదేశాలు ఇస్తూ.. ‘ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్’ అంటూ ఆనాడు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్ వీడియోకు ప్రజావేదికను కూల్చేసే విజువల్స్‌ను జత చేర్చారు.

- Advertisement -

వైఎస్ జగన్ మొదట చెప్పిన తమ విధ్వంస విధానాన్నే వైసీపీ ప్రభుత్వం నిత్యం పాటిస్తోందంటూ కామెంట్ పెట్టారు. మొదటి రోజు ప్రజా వేదిక కూల్చివేత నిర్ణయంతో మొదలైన రాష్ట్ర విధ్వంసం.. నాలుగేళ్లు పూర్తి చేసుకుని 5వ ఏట అడుగు పెట్టింది.. అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News