IND VS PAK : ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ పోవడంతో పాకిస్తాన్ బ్యాటింగ్ చేసింది. దీంతో ప్రతీ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా తొలి ఓవర్ తో ప్రారంభం చేసేది. అయితే గాయం కారణంగా ఇవాళ పాండ్యా మ్యాచ్ కి దూరం కావడంతో ఫస్ట్ ఓవర్ ఎవ్వరూ వేస్తారా..? అనే ఆసక్తి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో శివమ్ దూబే తొలి ఓవర్ బౌలింగ్ చేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ ఆ తరువాత వచ్చిన బుమ్రా 7 పరుగులు ఇవ్వడంతో అప్పటి నుంచి స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా బౌలర్ బుమ్రా.. పాకిస్తాన్ బ్యాటర్ ఫర్హాన్ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
Also Read : IND Vs PAK : టాస్ గెలిచిన టీమిండియా.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..?
పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ బుమ్రా బౌలింగ్ ఎక్కువ కొట్టాడని వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ టోర్నీలో బుమ్రా బౌలింగ్ లో సాహిబ్ దా ఫర్హాన్ 3 సిక్సర్లు, 7 ఫోర్లు కొట్టడం విశేషం. వాస్తవానికి బుమ్రా బౌలింగ్ లో ఎవ్వరైనా సిక్స్ లు కొట్టాలంటే జంకుతారు. బంతిని టచ్ చేయలేక పోతుంటారు. అలాంటిది సిక్స్ లు కొట్టడంతో బుమ్రా అతనికీ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలి 9 ఓవర్లలో పాకిస్తాన్ బ్యాటింగ్ చూస్తే.. టీమిండియా ఓడిపోతుందనేలా ఓపెనర్లు ఆడారు. 14.3 ఓవర్ లో వరుణ్ చక్రవర్తి ఫఖర్ జమాన్ ఔట్ చేయడంతో అప్పటి నుంచి మ్యాచ్ టర్న్ తిరిగింది. మరోవైపు కుల్దీప్ యాదవ్ 17వ ఓవర్ లో 3 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ టర్నింగ్ తీసుకుంది. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి వికెట్లుతీయడంతో పాకిస్తాన్ కి కళ్లెం వేసినట్టయింది.
Also Read : IND Vs PAK : ఆసియా కప్ ఫైనల్.. ఫ్రీ లైవ్ ఎక్కడ చూడాలంటే..ఇకపై డీడీ స్పోర్ట్స్లోనూ?
ప్రారంభంలో భారీ పరుగులు సమర్పించుకున్న జస్ప్రిత్ బుమ్రా.. 18వ ఓవర్ లో, 20వ ఓవర్ తొలి బంతికి వికెట్లను తీసి 19.1 ఓవర్ లోనే పాకిస్తాన్ ని ఆలౌట్ చేశారు. పాకిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ ఫర్హాన్ 57, ఫకర్ జమాల్ 46, సయిమ్ అయూబ్ 14, హారిస్ 0, సల్మాన్ అఘా 8, హుస్సెయిన్ తలాత్ 1, మహ్మద్ నవాజ్ 6, హారిస్ రవూఫ్ 6, అబ్రార్ 1 పరుగు చేశారు. దీంతో 19.1 ఓవర్ లో 146 పరుగులు చేసింది పాకిస్తాన్ జట్టు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 2, కుల్దీప్ యాదవ్ 4, వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్ 2 చొప్పున వికెట్లు తీశారు. దీంతో భారత్ టార్గెట్ 147 పరుగులు. 20 ఓవర్లలో టీమిండియా కచ్చితంగా 147 పరుగులు చేస్తుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుండటం విశేషం.