Visakha Development: విశాఖ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికల సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖను అభివృద్ది చేయడంలో అందరూ కలిసి పనిచేయాలని కోరారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా వీఈఆర్ అభివృద్ధి చేయాలని తెలిపారు. వీఈఆర్ ప్లానింగ్ కోసం ఆంధ్రా యూనివర్శిటీ సేవలు తీసుకోవాలని తెలిపారు.
విశాఖ ఎకనామిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి మైక్రో ప్లానింగ్ మరియు ఈస్ట్-వెస్ట్ కనెక్టివిటీపై దృష్టి సారించడం ద్వారా విశాఖ ప్రాంత అభివృద్ధి మరింత జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికల సమీక్షలో సీఎం చంద్రబాబు మాడ్లాడుతూ.. విశాఖ రీజియన్ పరిధిలో కొత్త ప్రాజెక్టులు CRZ రీ-క్లాసిఫికేషన్, వైజాగ్ బే సిటీ, బే-సిటీ అథారిటీ ఏర్పాటు వంటి అంశాలపై సీఎం సమీక్షించారు.
Also Read: జగన్ పర్యాటనలో ప్రమాదం..
వీఈఆర్ పరిధిలో మొత్తంగా రూ. 9.50 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందని, ప్రైవేట్ రంగం నుంచి రూ. 5.30 లక్షల కోట్ల పెట్టుబడులు, అలాగే రూ. 3.50-4 లక్షల కోట్ల మేర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయాల్సి వస్తుందని సిఎం చంద్రబాబు దృష్టికి అధికారులు తీసుకొళ్లారు. సీఆర్ జెడ్ నిబంధనలకు అనుగుణంగా వీఈఆర్ ప్రాజెక్ట్ రూపు చేయాలని, వీఈఆర్ పరిధిలో ఉన్న 6 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో అద్భుతమైన అభివృద్ధి జరగాలన్నారు. అంతర్జాతీయ నగరంగా విశాఖ ఎదుగుతోందని సీఎం చంద్రబాబు కొనియాడారు.
Also Read: హైదరాబాద్లో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు