E-Paper
Advertisement

CM Jagan Mohan Reddy : తాడేపల్లిలో ఘనంగా సంక్రాంతి వేడుకలు.. సతీసమేతంగా పాల్గొన్న సీఎం జగన్..!

CM Jagan Mohan Reddy : తాడేపల్లిలో ఘనంగా సంక్రాంతి వేడుకలు.. సతీసమేతంగా పాల్గొన్న సీఎం జగన్..!
Advertisement

CM Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలో తన నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు . పల్లె ప్రజలు, రైతులతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం సీఎం జగన్‌కు ఆనవాయితీగా వస్తోంది.

ఈ ఏడాది కూడా సీఎం జగన్ సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తొలుత సీఎం వైఎస్‌ జగన్, సతీమని భారతి దంపతులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయటంతో పండుగ సంబరాలు మొదలయ్యాయి. అనంతరం బసవన్నలకు జగన్ సారెను సమర్పించారు. గోపూజ కార్యక్రమంలో దంపతులిద్దరూ పాల్గొన్నారు.

Advertisement

ప్రభుత్వ విప్‌ చంద్రగిరి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు ‘X’ ద్వారా తెలిపారు. “ఊరూ వాడా ఒక్కటై, బంధు మిత్రులు ఏకమై అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి, సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని.. సుఖ సంతోషాలతో.. విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా” అని ట్వీట్‌ చేశారు.

Advertisement

.

.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×