E-Paper
Advertisement

Report on AP’s Debt: ఏపీలో అప్పుల కుప్ప.. బయటపెట్టిన కాగ్, వైసీపీ పాలనలో..

Report on AP’s Debt: ఏపీలో అప్పుల కుప్ప.. బయటపెట్టిన కాగ్, వైసీపీ పాలనలో..

Report on AP’s Debt: ఏపీలో అప్పులు ఎంతవరకు ఉన్నాయి? బడ్జెట్‌లో ఏ విషయాలు ప్రభుత్వం బయటపెట్టింది? ఆర్థిక స్థితిపై కాగ్ తేల్చిన నిజాలేంటి? భారమంతా కూటమి సర్కార్‌పై పడిందా? అవుననే అంటున్నాయి కాగ్ లెక్కలు.

ప్రభుత్వాలు ఖర్చు చేసే ప్రతీ రూపాయి బయటపెడుతుంది కాగ్. ప్రభుత్వాలు చెప్పే లెక్కల కన్నా, కాగ్‌నే అందరూ ప్రమాణికంగా తీసుకుంటారు. ఎవరేమనుకున్నా కాగ్ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. వైసీపీ రూలింగ్‌లోని చివరి ఏడాది లెక్కల చిట్టాను బయటపెట్టింది కాగ్.

సింపుల్‌గా చెప్పాలంటే ప్రభుత్వానికి వచ్చే ప్రతీ రూపాయిలో 19 పైసలు అప్పు తీర్చేందుకు వెళ్తుందని తేల్చింది. ఆస్తుల సృష్టికి కేవలం 9 పైసలు మాత్రమే కేటాయించింది. శాసనసభ అనుమతి లేకుండా 634 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు బయటపెట్టింది.

2023-24 ఏడాది ఆర్థిక సంవత్సరం లెక్కల్ని పరిశీలించిన కాగ్, దాదాపు 33 వేల కోట్ల బడ్జెటేతర రుణాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థికశాఖకు తెలియజేసింది. ఇక బడ్జెట్‌లో చూపని రుణాల కోసం అసలు, వడ్డీల రూపంలో 10 వేల కోట్లు పైగానే ఉందన్నది అందులోని సారాంశం.

ALSO READ: : రఘురామ్ లాస్ట్ స్పీచ్.. జగన్ చేసింది కరెక్టేనంటూ వ్యాఖ్య

జీఎస్డీపీలో అప్పుల వాటా 34 శాతంగా పేర్కొంది. 2023-24 ఆర్థిక ఏడాదికి రూ.4, 86, 151 కోట్ల రూపాయలున్నట్లు పేర్కొంది. పెండింగ్‌ బిల్లులు దాదాపు రూ. 1.50 లక్షల కోట్ల మేరా ఉన్నాయి. కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చి అప్పులు సమీకరిస్తోంది. వాటిని బడ్జెట్‌లో చూపలేదట.

కేంద్రం ఇచ్చిన నిధులు 30 రోజల్లోపు చెల్లించలేదు. దీంతో కేంద్రానికి ఏడు శాతం వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అలా 2023-24 ఏడాదికి 283.96 కోట్ల రూపాయలకు వడ్డీ చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని కాగ్ తన లెక్కల్లో ప్రస్తావించింది.

ప్రభుత్వం సరైన సమయంలో నిధులు చెల్లించలేదు. దీంతో వడ్డీ భారం భరించాల్సి వచ్చింది కడిగి పారేసింది కాగ్. ఇదికాకుండా 53 కోట్ల రూపాయలు రెవిన్యూ అవసరాల కోసం ఖర్చు చేసి, ఆ మొత్తాన్ని మూలధన వ్యయం కింద లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. వైసీపీ ఆర్థికభారమంతా ఇప్పుడు కూటమి సర్కార్‌పై పడింది.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×