BigTV English

Raghu Rama on Jagan: రఘురామ్ లాస్ట్ స్పీచ్.. జగన్ చేసింది కరెక్టేనంటూ వ్యాఖ్య

Raghu Rama on Jagan: రఘురామ్ లాస్ట్ స్పీచ్.. జగన్ చేసింది కరెక్టేనంటూ వ్యాఖ్య

Raghu Rama on Jagan: రుషికొండ ప్యాలెస్‌ గురించి అసెంబ్లీలో చిన్నపాటి చర్చ జరిగింది. నేతల మాటల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రుషికొండ ప్యాలెస్ విషయంలో జగన్ అల్లరైనా, మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశారన్నారు.


డిప్యూటీ స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవికి ఆయనొక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవమైనట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ సందర్భంగా సభలో విశాఖ రుషికొండ ప్యాలెస్‌పై చిన్నపాటి చర్చ జరిగింది.

మాజీ సీఎం జగన్‌ని ఎమ్మెల్యేగా రఘురామరాజు తన పొగడ్తలతో ముంచెత్తారు. 500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టి జగన్ అల్లరి పాలైనా, మంచి ప్రభుత్వం రావడానికి దోహదపడ్డారంటూ తనదైనశైలిలో వ్యాఖ్యానించారు. సింపుల్‌గా చెప్పాలంటే ఆయన తన రాజకీయ సమాధిని కట్టుకున్నారని చెప్పుకొచ్చారు.


రుషికొండ ప్యాలెస్ విషయంలో మొదటి నుంచి జరిగిన ప్రతీ విషయాన్ని పూసగుచ్చి మరీ వివరించారు. అప్పటివరకు టూరిజం ప్రాజెక్టని చెప్పిన గత ప్రభుత్వం, తాను విశాఖ వస్తున్నానంటూ జగన్ చెప్పడం వెనుక అసలు మతలబుని బయటపెట్టారు.

ALSO READ: దమ్ముంటే అడుగు పెట్టు.. ఆపై మాట్లాడు.. ఇచ్చిపడేసిన షర్మిల

రఘురామరాజు మాటలను సభలో సభ్యులంతా ఒకటే నవ్వులు. వేల కోట్లు రకరకాల రూపంలో దుర్వినియోగం అయ్యాయని అన్నారు. ఆయన తన రాజకీయ సమాధి కట్టుకున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో విశాఖ ఎమ్మెల్యేలు రుషికొండ ప్యాలెస్ గురించి తమదైన శైలిలో చెప్పుకొచ్చారు.

బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ప్యాలెస్ గురించి ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా సభ్యులకు వివరించారు. అక్కడ మనం ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదని, అంతా ఆటో వాషింగ్ అంటూ వ్యాఖ్యానించారాయన. అందులోని విలాస వస్తువులు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందేన్నారు.

 

Related News

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Big Stories

×