BigTV English
Advertisement

Srisailam Project: కనువిందు చేస్తున్న కృష్ణమ్మ.. శ్రీశైలంలో పర్యాటకుల సందడి

Srisailam Project: కనువిందు చేస్తున్న కృష్ణమ్మ.. శ్రీశైలంలో పర్యాటకుల సందడి

Huge inflow to Srisailam Project: కృష్ణా నది బిరా బిరా మంటూ పరిగెడుతూ సందడి చేస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి కిందకు అందంగా పరవళ్లు పెడుతుండడాన్ని చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. దీంతో శీశైలంలో పర్యాటకుల సందడి వాతావణరం నెలకొన్నది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో భారీగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు పది గేట్లను ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఆనకట్ట వద్దకు భారీగా పర్యాటకులు వస్తున్నారు.


శనివారం తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలిరావడంతో ప్రాజెక్టు జనాలతో కిటకిటలాడుతుంది. పర్యాటకులు శ్రీశైలం ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి పరుగులు తీస్తున్న కృష్ణమ్మ పరవళ్లను చూస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో జలాశయం పరిసర మార్గాల్లో వాహనాలు బారులు తీరాయి. మొదటగా శ్రీశైలం చురుకుని అక్కడ శ్రీభమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని, ఆ తరువాత జలాశయం వద్దకు చేరుకుని కృష్ణానది అందాలను వీక్షిస్తున్నారు. అనకట్టుకు రెండు వైపుల నుంచి వాహనాలు భారీగా రావడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లింగాల గట్టు ప్రాంతంలో చేపల విక్రయాలు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ మరింతగా పెరిగింది.

Also Read: జనసేన, టీడీపీ దెబ్బకి దిగొచ్చిన జగన్.. కొత్త ప్లాన్ ఇదేనా?


10 గేట్ల నుంచి దిగువకు నీరు విడుదల

ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా కొనసాగుతున్నది. ఎగువ పరివాహక ప్రాంతాలైన సుంకేసుల, జూరాల జలాశయాల నుంచి 4,81,246 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం 10 గేట్లను ఎత్తి 4,64,740 క్యూసెక్కుల నీటిని దిగువనకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ఎడమ, కుడి గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూ 62,668 క్యూసెక్కుల నీటిని అదనంగా అధికారులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు.

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×