E-Paper
Advertisement

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..
Advertisement

Sub Registrar Office Seized: విశాఖ మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. బుధవారం సోదాలు చేసిన ఏసీబీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఇవాళ కార్యాలయాన్ని సీజ్ చేయడంతో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరోవైపు జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ ఆపీస్‌లో డిజిటల్ పేమెంట్లపై దృష్టి సారించింది ఏసీబీ. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగిస్తూ ఉన్నారు.

సమాచారం మేరకు, మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో.. పత్రాల రిజిస్ట్రేషన్లలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందనే ఫిర్యాదులు ఏసీబీకి అందాయి. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు ఉదయం నుంచే సడెన్ రైడ్స్ చేపట్టారు. కార్యాలయంలో ఉన్న రికార్డులు, రిజిస్టర్ పుస్తకాలు, సర్వర్ డేటా, ఫైల్ మూమెంట్ వివరాలు, ఆన్‌లైన్ లావాదేవీలను ఒక్కొక్కటిగా పరిశీలించారు.

Advertisement

సోదాల సందర్భంగా అధికారులు పలు కీలక పత్రాలు, అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పత్రాల పరిశీలనలో అక్రమ రిజిస్ట్రేషన్లు, బెనామీ లావాదేవీలు, పన్ను ఎగవేతకు సంబంధించిన కొన్ని అంశాలు బయటపడినట్లు తెలుస్తోంది. కొంతమంది సిబ్బంది హాజరుకాకుండా పారిపోవడంతో.. ఏసీబీ అధికారులు వారిని వెతికే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రాథమిక విచారణ అనంతరం అధికారులు మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. కార్యాలయ తాళాలను సీల్ చేస్తూ, ఎవ్వరూ లోపలికి వెళ్లకూడదని సూచించారు. విచారణ పూర్తయ్యే వరకు ఆ కార్యాలయంలో అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

ఏసీబీ దాడుల ప్రభావంతో విశాఖలోని పలు దస్తావేజుల లేఖరి కార్యాలయాలు కూడా తాత్కాలికంగా మూతపడ్డాయి. అధికారులు ఎప్పుడైనా సోదాలు నిర్వహిస్తారనే భయంతో లేఖరులు కార్యాలయాలను మూసి వేసినట్లు తెలిసింది. పత్రాల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

విశాఖ నగరంలో గత కొద్ది నెలలుగా పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పత్రాల రిజిస్ట్రేషన్‌లో లంచాలు, మద్యవర్తిత్వం, తప్పుడు పత్రాలు, భూముల దందాలు తరచుగా వినిపిస్తున్నాయి.

Also Read: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

అధికారులు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న పత్రాలను విశ్లేషించడానికి ప్రత్యేక బృందం ఏర్పాటుచేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యాలయాలపై సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×