E-Paper
Advertisement

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Sub Registrar Office Seized: విశాఖ మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. బుధవారం సోదాలు చేసిన ఏసీబీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఇవాళ కార్యాలయాన్ని సీజ్ చేయడంతో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరోవైపు జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ ఆపీస్‌లో డిజిటల్ పేమెంట్లపై దృష్టి సారించింది ఏసీబీ. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగిస్తూ ఉన్నారు.

సమాచారం మేరకు, మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో.. పత్రాల రిజిస్ట్రేషన్లలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందనే ఫిర్యాదులు ఏసీబీకి అందాయి. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు ఉదయం నుంచే సడెన్ రైడ్స్ చేపట్టారు. కార్యాలయంలో ఉన్న రికార్డులు, రిజిస్టర్ పుస్తకాలు, సర్వర్ డేటా, ఫైల్ మూమెంట్ వివరాలు, ఆన్‌లైన్ లావాదేవీలను ఒక్కొక్కటిగా పరిశీలించారు.

సోదాల సందర్భంగా అధికారులు పలు కీలక పత్రాలు, అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పత్రాల పరిశీలనలో అక్రమ రిజిస్ట్రేషన్లు, బెనామీ లావాదేవీలు, పన్ను ఎగవేతకు సంబంధించిన కొన్ని అంశాలు బయటపడినట్లు తెలుస్తోంది. కొంతమంది సిబ్బంది హాజరుకాకుండా పారిపోవడంతో.. ఏసీబీ అధికారులు వారిని వెతికే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రాథమిక విచారణ అనంతరం అధికారులు మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. కార్యాలయ తాళాలను సీల్ చేస్తూ, ఎవ్వరూ లోపలికి వెళ్లకూడదని సూచించారు. విచారణ పూర్తయ్యే వరకు ఆ కార్యాలయంలో అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

ఏసీబీ దాడుల ప్రభావంతో విశాఖలోని పలు దస్తావేజుల లేఖరి కార్యాలయాలు కూడా తాత్కాలికంగా మూతపడ్డాయి. అధికారులు ఎప్పుడైనా సోదాలు నిర్వహిస్తారనే భయంతో లేఖరులు కార్యాలయాలను మూసి వేసినట్లు తెలిసింది. పత్రాల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

విశాఖ నగరంలో గత కొద్ది నెలలుగా పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పత్రాల రిజిస్ట్రేషన్‌లో లంచాలు, మద్యవర్తిత్వం, తప్పుడు పత్రాలు, భూముల దందాలు తరచుగా వినిపిస్తున్నాయి.

Also Read: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

అధికారులు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న పత్రాలను విశ్లేషించడానికి ప్రత్యేక బృందం ఏర్పాటుచేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యాలయాలపై సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×