BigTV English
Advertisement

Cyclone : దూసుకొస్తున్న మాండూస్ తుపాన్.. తీరం ఎప్పుడు దాటుతుందంటే?

Cyclone : దూసుకొస్తున్న మాండూస్ తుపాన్.. తీరం ఎప్పుడు దాటుతుందంటే?

Cyclone : ఆగ్నేయ బంగాళాఖాతంలో మాండూస్ తుపాను తీవ్రరూపం దాలుస్తోంది. పశ్చిమ-వాయువ్య దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాములోగా పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది.



తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ప్రకటించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు తుపాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

కాకినాడ జిల్లాలో తుపాను ప్రభావంతో ఈదురు గాలులు వీచుస్తున్నాయి. ఉప్పాడ సముద్రతీరంలో అలలు ఎగిసి పడుతున్నాయి. దీంతో కాకినాడ- ఉప్పాడ బీచ్ రోడ్డులో రాకపోకలు బంద్ చేశారు.


తమిళనాడులో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది . ఆ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీరంలో బలంగా గాలులు వీస్తున్నాయి. దీంతో పలు పోర్టుల్లో 5నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. చెన్నై విమానాశ్రయం నుంచి 15 విమాన సర్వీసులను రద్దు చేశారు. అటు పుదుచ్చేరి నుంచి విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు.

Tags

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×