E-Paper
Advertisement

Cyclone : దూసుకొస్తున్న మాండూస్ తుపాన్.. తీరం ఎప్పుడు దాటుతుందంటే?

Cyclone : దూసుకొస్తున్న మాండూస్ తుపాన్.. తీరం ఎప్పుడు దాటుతుందంటే?
Advertisement

Cyclone : ఆగ్నేయ బంగాళాఖాతంలో మాండూస్ తుపాను తీవ్రరూపం దాలుస్తోంది. పశ్చిమ-వాయువ్య దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాములోగా పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది.


తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ప్రకటించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు తుపాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

Advertisement

కాకినాడ జిల్లాలో తుపాను ప్రభావంతో ఈదురు గాలులు వీచుస్తున్నాయి. ఉప్పాడ సముద్రతీరంలో అలలు ఎగిసి పడుతున్నాయి. దీంతో కాకినాడ- ఉప్పాడ బీచ్ రోడ్డులో రాకపోకలు బంద్ చేశారు.

తమిళనాడులో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది . ఆ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీరంలో బలంగా గాలులు వీస్తున్నాయి. దీంతో పలు పోర్టుల్లో 5నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. చెన్నై విమానాశ్రయం నుంచి 15 విమాన సర్వీసులను రద్దు చేశారు. అటు పుదుచ్చేరి నుంచి విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×