E-Paper
Advertisement

Cyclone Michaung: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో భారీ నుంచి అతి భారీవర్షాలు

Cyclone Michaung: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో భారీ నుంచి అతి భారీవర్షాలు
Advertisement

Cyclone Michaung: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని IMD వెల్లడించింది. ఇది క్రమంగా రూపాంతంరం చెందుతూ శనివారానికి తీవ్రవాయుగుండంగా.. ఆదివారం నాటికి తుపాన్ గా మారుతుందని, దీని ప్రభావంతో APలోని పలు చోట్ల ఆది, సోమ వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్య కారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. తుపాన్ తీవ్రత నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. పంట కోతలపై అవగాహన కల్పించాలని, రైతులకు అందుబాటులో ఉండాలని సూచించింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు కూడా కోతలు కోసి ఉంచిన పంటపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

కాగా.. మిచౌంగ్ తుపాను సోమవారం సాయంత్రానికి చెన్నై-మచిలీపట్నం మధ్య తీరందాటే అవకాశం ఉందని వివరించింది. వాయుగుండం, తుపాను ప్రభావంతో ఆదివారం నుంచి ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.

Advertisement

మరోవైపు తమిళనాడును వర్షాలు వణికిస్తున్నాయి. రెండు రోజులుగా దంచికొడుతున్న వానలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువళ్లూరు, కాంచీపురం, చెన్నై ప్రాంతాలకు అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. వారంరోజులుగా ఏజెన్సీలో చలి ప్రభావం పెరుగుతోంది. చింతపల్లిలో కనిష్ఠంగా 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం వేళల్లో కాఫీ తోటలు, పంట పొలాలకు వెళ్లే కూలీలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు వణుకుతూ ప్రయాణం చేస్తున్నారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×