E-Paper
Advertisement

Prakasam District: గవర్నమెంట్ స్కూల్‌లో దారుణం.. స్టూడెంట్‌పై టీచర్ లైంగిక దాడి..?

Prakasam District: గవర్నమెంట్ స్కూల్‌లో దారుణం.. స్టూడెంట్‌పై టీచర్ లైంగిక దాడి..?
Advertisement

Prakasam District:  ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి..  వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడే కీచకుడిగా మారడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దర్శి పట్టణంలోని ఒక స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అదే పాఠశాలలో చదువుతున్న ఒక చిన్నారి పట్ల ఆయన గత కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఆ ఉపాధ్యాయుడు మరోసారి హద్దు మీరి ప్రవర్తించడంతో..  బాధితురాలు ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది. తన బిడ్డకు జరిగిన అన్యాయాన్ని విని చలించిపోయిన తల్లిదండ్రులు, బంధువులతో కలిసి పాఠశాలకు చేరుకున్నారు.

Advertisement

బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు,  స్థానికులు పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడైన వెంకటేశ్వర్లును కఠినంగా శిక్షించాలంటూ పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న దర్శి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు.

ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు నిందితుడు వెంకటేశ్వర్లును తమ అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రహంతో ఉన్న జనాల నుండి అతడిని రక్షించి..  విచారణ నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ‘పాఠశాలలు పిల్లలకు సురక్షితమైన ప్రదేశాలుగా ఉండాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై లోతైన విచారణ చేపట్టారు. సాక్ష్యాధారాలను సేకరించి..  నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యాశాఖ అధికారులు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, సదరు ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

ALSO READ: Diamond Jewellery Robbery: జస్ట్ 5 మినిట్స్.. అలా వచ్చారు.. ఇలా రూ.10 కోట్ల ఆభరణాలు తీసుకెళ్లారు..

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×