BigTV English
Advertisement

Deepam Scheme : ఏపీలో కూటమి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు.. కానీ మంచి మనసు ఉంది – చంద్రబాబు

Deepam Scheme : ఏపీలో కూటమి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు.. కానీ మంచి మనసు ఉంది – చంద్రబాబు

Deepam Scheme : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. సూపర్ సిక్స్ లో ఒకటైన ఉచిన గ్యాస్ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. చిన్నప్పుడు తన తల్లి కట్టేల పొయ్యిపై వంట చేయడం చూశానని చెప్పిన చంద్రబాబు.. ఒకేసారి ఇంటికి 10, 20 మంది వస్తే కట్టెల పొయ్యిపై వంట చేయడం ఎంత బాధో తనకు తెలుసన్నారు. తన తల్లే కాదు.. రాష్ట్రంలోని ఏ ఆడబిడ్డ అలా కష్టపడకూడదనే తాను ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు.


నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తనకు.. తన జీవితంలో ఎప్పుడూ చూడని విధ్వంస రాష్ట్రాన్ని చూశానని అన్నారు. ఏ శాఖలో రివ్యూ చేసినా.. ఎక్కడికి వెళుతుందో అర్ధం కాని పరిస్థితిలు ఉన్నాయని అన్నారు. తన రాజకీయ జీవితంలో అంత దారుణమైన పరిస్థితులు చూడలేదని అన్నారు. కేంద్ర పంపిన డబ్బులను జగన్ సర్కార్ దారి మళ్లించిందని ఆరోపించారు. ఒక్క సివిల్ సప్లై శాఖలోనే 41 వేల కోట్లను దారిమళ్లించినట్లు వెల్లడించారు.

గ్యాస్ సిలిండర్ పరిచయం చేసింది నేనే..


దేశంలో తొలిసారి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తొలిసారి ప్రజలకు గ్యాస్ సిలిండర్లను పరిచయం చేశానని గుర్తు చేసిన సీఎం చంద్రబాబు.. ధరలు పెరుగుతుండడంతో గ్యాస్ వినియోగం తగ్గిందని అన్నారు. ఆ కారణంగానే.. ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామని ప్రకటించారు. అప్పట్లోనే 59 లక్షల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించామని.. ఆ కారణంగానే ఇప్పుడు రాష్ట్రంలో 1.59 కోట్ల గ్యాస్ సిలిండర్లు వచ్చాయని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కడుతుంది..

ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించేందుకు కేంద్ర వైపు నుంచి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయని.. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామన్నారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతాని.. గ్యాస్ బుక్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే డీబీటీ పద్దతిలో కేంద్రానికి డబ్బులు కడతామని, డబ్బులు కట్టి గ్యాస్ తీసుకున్న ప్రజలకు.. 48 గంటల్లో తిరిగి బ్యాంకు ఖాతాల్లో పడతాయని చెప్పారు.

25 ఏళ్లు తాగే మందు డబ్బులపై ముందే అప్పులు తెచ్చారు..

రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో జగన్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిదన్న చంద్రబాబు.. వారి ఆరోగ్యాలను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకు వచ్చారని విమర్శించారు. మందుబాబులు తాగితే వచ్చే డబ్బుల్ని చూపించి వాటిపై భారీగా అప్పుగా తెచ్చారని చెప్పారు. రాష్ట్రంలో 25 ఏళ్లు మద్యం తాగితే ఎంత డబ్బులు వస్తాయో వాటన్నింటిపై అప్పులున్నాయని వివరించారు.

గత ఐదేళ్లల్లో రాష్ట్రంలో ఇసుక దోపిడి పెద్ద ఎత్తున జరిగిందన్న చంద్రబాబు.. వైసీపీ నాయకులు భారీగా సంపాదించుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ఇసుక.. ప్రజల ఆస్తి అన్న చంద్రబాబు.. అవసరమైన వాళ్లు ఉచితంగా ఇసుకను తీసుకువెళ్లవచ్చని చెప్పారు. ఉచిత ఇసుక పంపిణీ విషయంలో ఏ నాయకుడు జోక్యం చేసుకోవద్దని కూటమి పార్టీ నాయకులు సూచించినట్లు తెలిపారు.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×