E-Paper
Advertisement

Vizag Fishing Harbor : విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదం.. విచారణకు కమిటీ ఏర్పాటు

Vizag Fishing Harbor : విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదం.. విచారణకు కమిటీ ఏర్పాటు
Advertisement
Vizag Fishing Harbor issue

Vizag Fishing Harbor issue(Andhra pradesh today news):

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. విచారణకు స్పీడ్‌ పెంచిన అధికార యంత్రాంగం కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ, అగ్నిమాపక, మత్స్యశాఖ, ఫోరెన్సిక్‌, పోలీస్‌శాఖ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్‌. అలాగే క్రైమ్‌, సీసీఎస్‌, టాస్క్ ఫోర్స్‌ విభాగాలతో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి రెండ్రోజుల్లో నివేదిక అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఫిషింగ్‌ హార్బర్‌ ప్రమాద ఘటనకు కారకుడు యూట్యూబర్ లోకల్ బాయ్ నానేనంటూ అనుమానం వ్యక్తి చేశారు. దీంతో నానికి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అయితే.. తమ దర్యాప్తులో ఈ ప్రమాద ఘటనకు లోకల్‌ బాయ్‌కి ఏ సంబంధం లేదని పోలీసులు నిర్థారించినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో నాని ఓ హోటల్లో పార్టీ చేసుకుని బయటకు వస్తున్నట్టు సీసీ కెమెరాలో రికార్డ్‌కావడంతో.. ఆ దృశ్యాల ఆధారంగా నానికి సంబంధం లేదని చెబుతున్నట్టు సమాచారం. మత్స్యకారులకు కన్నీళ్లు పెట్టించిన ఘటనపై కూపీ లాగుతున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మంగళవారం ఘటనాస్థలాన్ని పలువురు పార్టీ నేతలు పరిశీలించనున్నారు. వైవీ సుబ్బారెడ్డి, జీవీయల్‌, గంటా, కొల్లు రవీంద్రలు ప్రమాదంపై ఆరా తీయనున్నారు. ఇక ఇప్పటికే విశాఖ అగ్నిప్రమాదం ఘటనపై స్పందించిన సీఎం జగన్‌ నష్టపరిహాన్ని ప్రకటించారు. ప్రమాదంలో కాలి బూడిదైన పడవలకు 80 శాతం పరిహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

ఆదివారం అర్థరాత్రి మత్స్యకారులు ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో విశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 50కిపైగా బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో సుమారు 40 కోట్ల ఆస్తినష్టం వాటిల్లిందని చెబుతున్నారు మత్స్యకారులు. తమకు ఉపాధినిచ్చే పడవలు కళ్ల ముందే కాలి బూడిదవుతుంటే కన్నీళ్లు పెడుతూ విలవిలలాడిపోయారు గంగపుత్రులు. మద్యం మత్తులో ఆకతాయిల పనేనని అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత యూట్యూబర్‌ లోకల్‌ బాయ్‌ నానిని అనుమానించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే.. నానికి.. ప్రమాదానికి ఏ సంబంధం లేదని పోలీసులు తేల్చినట్టు సమాచారం.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×