Duvvada Madhuri: తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట గురించి తెలియని వారుండరు. ఇక తాజాగా దివ్వెల మాధురి బిగ్బాస్ షోలో పాల్గొని, తన పాపులారిటీని మరింత పెంచుకున్న సంగతి తెలిసిందే. ఈ లవ్బర్డ్స్ గురించి నిత్యం ఏదొక వార్త వస్తూనే ఉంటుంది. ఈక్రమంలో తాజాగా దువ్వాడ శ్రీనివాస్ , మాధురిలు వివాదంలో చిక్కుకున్నారు. ఈ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్వెల మాధురీకి ఊహించని షాక్ తగిలింది. దివ్వెల మాధురి బర్త్ డే పార్టీ భగ్నం అయినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో పెండెండ్ ఫామ్హౌస్లో దివ్వెల మాధురి భర్త్ డే పార్టీనీ భగ్నం చేశారు రాజేంద్రనగర్ పోలీసులు. ఆ పార్టీలో ఆమెతో పాటు దువ్వాడ శ్రీనివాస్ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం.
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ వేడుకకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా భారీ ఎత్తున సౌండ్ సిస్టమ్స్, డిజే ఏర్పాట్లు చేయడంతో సహా విదేశీ మద్యం, హుక్కా పరికరాలు వాడినట్లు తేలింది. శబ్దం ఎక్కువగా ఉందని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులతో పాటు, పార్టీకి అనుమతి లేదని వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది.
Also Read: రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులు.. ఉద్యోగులకు రెండు డీఏలు.. ఏపీ కేబినెట్ నిర్ణయాలివే
ఈ సంఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉంటే.. ఇటీవలే దివ్వెల మాధురి బిగ్ బాస్ 9 కు వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ ఆమెకు ఓటింగ్ రాకపోవడంతో ఎలిమినేట్ అయ్యారు. ఇక అటు తన మొదటి భార్యకు దూరంగా ఉంటున్న దువ్వాడ శ్రీనువాస్ మాధురీతో కలిసి ఉంటున్నాడు.