E-Paper
Advertisement

Duvvada Madhuri: పర్మిషన్ లేకుండా బర్త్‌డే పార్టీ.. దువ్వాడ మాధురికి పోలీసులు షాక్

Duvvada Madhuri: పర్మిషన్ లేకుండా బర్త్‌డే పార్టీ.. దువ్వాడ మాధురికి పోలీసులు షాక్
Advertisement

Duvvada Madhuri: తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి జంట గురించి తెలియని వారుండరు. ఇక తాజాగా దివ్వెల మాధురి బిగ్‌బాస్ షోలో పాల్గొని, తన పాపులారిటీని మరింత పెంచుకున్న సంగతి తెలిసిందే. ఈ లవ్‌బర్డ్స్‌ గురించి నిత్యం ఏదొక వార్త వస్తూనే ఉంటుంది. ఈక్రమంలో తాజాగా దువ్వాడ శ్రీనివాస్ , మాధురిలు వివాదంలో చిక్కుకున్నారు. ఈ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే.. దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్వెల మాధురీకి ఊహించని షాక్ తగిలింది. దివ్వెల మాధురి బర్త్ డే పార్టీ భగ్నం అయినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో పెండెండ్ ఫామ్‌హౌస్‌లో దివ్వెల మాధురి భర్త్ డే పార్టీనీ భగ్నం చేశారు రాజేంద్రనగర్ పోలీసులు. ఆ పార్టీలో ఆమెతో పాటు దువ్వాడ శ్రీనివాస్ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం.

Advertisement

పోలీసుల సమాచారం ప్రకారం, ఈ వేడుకకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా భారీ ఎత్తున సౌండ్ సిస్టమ్స్, డిజే ఏర్పాట్లు చేయడంతో సహా విదేశీ మద్యం, హుక్కా పరికరాలు వాడినట్లు తేలింది. శబ్దం ఎక్కువగా ఉందని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులతో పాటు, పార్టీకి అనుమతి లేదని వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది.

Also Read: రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులు.. ఉద్యోగులకు రెండు డీఏలు.. ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

Advertisement

ఈ సంఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఇటీవలే దివ్వెల మాధురి బిగ్ బాస్ 9 కు వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ ఆమెకు ఓటింగ్ రాకపోవడంతో ఎలిమినేట్ అయ్యారు. ఇక అటు తన మొదటి భార్యకు దూరంగా ఉంటున్న దువ్వాడ శ్రీనువాస్ మాధురీతో కలిసి ఉంటున్నాడు.

Related News

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×