BigTV English

Earthquake in srikakulam: వణికిన శ్రీకాకుళం జిల్లా.. రెండుసార్లు భూ ప్రకంపనలు..

Earthquake in srikakulam: వణికిన శ్రీకాకుళం జిల్లా.. రెండుసార్లు భూ ప్రకంపనలు..

Earthquake in srikakulam: శ్రీకాకుళం జిల్లాను భూ ప్రకంపనలు వణికించాయి. ఇచ్చాపురం పరిసరాల్లో తెల్లవారుజామున మూడు గంటల 40 నిమిషాలకు ఒకసారి, నాలుగు గంటలకు మరోసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాదాపు మూడు సెకన్ల సేపు కంపించినట్టు ప్రజలు చెబుతున్నారు.


ప్రజలు భయంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్లపాటు భూమి కంపించినట్లు ప్రజలు చెబుతున్నమాట. గతంలో ఈ విధంగా ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. స్వల్ప ప్రకంపనలు కావడంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

రెండుసార్లు ప్రకంపనలు రావడంతో అధికారులు దృష్టి సారించారు. దీనికి సంబంధించి త్వరలో వెల్లడిస్తామన్నారు. రెండేళ్ల కిందట కూడా ఇదే విధంగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అప్పుడు కూడా భయంతో ప్రజలు వణికిపోయారు. గడిచిన 60 ఏళ్లలో ఇలాంటి భూ ప్రకంపనలు చూడలేదని అంటున్నారు స్థానికులు. శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.


 

Related News

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Big Stories

×