E-Paper
Advertisement

Earthquake in srikakulam: వణికిన శ్రీకాకుళం జిల్లా.. రెండుసార్లు భూ ప్రకంపనలు..

Earthquake in srikakulam: వణికిన శ్రీకాకుళం జిల్లా.. రెండుసార్లు భూ ప్రకంపనలు..

Earthquake in srikakulam: శ్రీకాకుళం జిల్లాను భూ ప్రకంపనలు వణికించాయి. ఇచ్చాపురం పరిసరాల్లో తెల్లవారుజామున మూడు గంటల 40 నిమిషాలకు ఒకసారి, నాలుగు గంటలకు మరోసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాదాపు మూడు సెకన్ల సేపు కంపించినట్టు ప్రజలు చెబుతున్నారు.

ప్రజలు భయంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్లపాటు భూమి కంపించినట్లు ప్రజలు చెబుతున్నమాట. గతంలో ఈ విధంగా ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. స్వల్ప ప్రకంపనలు కావడంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

రెండుసార్లు ప్రకంపనలు రావడంతో అధికారులు దృష్టి సారించారు. దీనికి సంబంధించి త్వరలో వెల్లడిస్తామన్నారు. రెండేళ్ల కిందట కూడా ఇదే విధంగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అప్పుడు కూడా భయంతో ప్రజలు వణికిపోయారు. గడిచిన 60 ఏళ్లలో ఇలాంటి భూ ప్రకంపనలు చూడలేదని అంటున్నారు స్థానికులు. శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.

 

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×