E-Paper
Advertisement

ED Raids Ex-MP: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ ఇంట్లో ఈడీ సోదాలు, బెంబేలెత్తుతున్న వైసీపీ నేతలు

ED Raids Ex-MP: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ ఇంట్లో ఈడీ సోదాలు, బెంబేలెత్తుతున్న వైసీపీ నేతలు
Advertisement

ED Raids Ex-MP: తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దూకుడు పెంచిందా? ఓ వైపు హైదరాబాద్.. మరోవైపు విశాఖపట్న రియల్టర్లపై ఫోకస్ చేసిందా? లేటెస్ట్‌గా విశాఖ మాజీ ఎంపీ వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. భూకబ్జాలు ఆరోపణల నేపథ్యంలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

శుక్రవారం సాయంత్రానికి విశాఖ చేరుకున్నారు ఈడీ అధికారులు. శనివారం ఉదయం లాసన్స్ బే కాలనీలోని ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లోనే ఫస్ట్ ఫ్లోర్‌లో తనిఖీలు చేపట్టారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు. అటు మధురువాడ లోని ఎంవీవీ సిటీ ఆఫీసులో సోదాలు చేస్తున్నారు. మాజీ ఎంపీతోపాటు ఆడిటర్ జీవీ ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు.

Advertisement

ఎంవీవీ సత్యనారాయణకి చెందిన  హైగ్రీవా ఇన్‌ఫ్రాటెక్ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. ఏకకాలంలో ఐదు చోట్ల సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా మధురవాడ భూమి కొనుగోలు కేసుతోపాటు రూ.12.5 కోట్ల లావాదేవీల వ్యవహారంలో ఎంవీవీపై ఈడీ కేసు నమోదు అయ్యింది. వాటిపై ఫోకస్ చేసినట్టు సమాచారం.

ఈడీ సోదాల విషయం తెలియగానే వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారట. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత, అధినేతకే కాదు తమకు కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు. వైసీపీ ఓటమి తర్వాత రాజకీయా ల నుంచి వైదొలగాలని ఎంవీవీ భావించారట. కాకపోతే కొన్ని కారణాల వల్ల సైలెంట్ అయిపోయారు.

Advertisement

ALSO READ: విశాఖ.. అధికారుల మొద్దు నిద్ర, ప్రభుత్వాలు మారినా మారని తీరు.. మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీలు

ఒక్కసారి వెనక్కి వెళ్తే.. విశాఖలో భూముల కబ్జా వ్యవహారంలో విజయసాయిరెడ్డిపై ఎంవీవీ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మళ్లీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్‌గా రావడం, ఎంవీవీ ఇంటిపై ఈడీ సోదాలు చేయడంపై ఆయన మద్దతుదారుల్లో అనుమానాలు మొదలయ్యాయి.

Related News

తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన.. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే ఛాన్స్

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

Big Stories

Advertisement
×