BigTV English
Advertisement

ED Raids Ex-MP: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ ఇంట్లో ఈడీ సోదాలు, బెంబేలెత్తుతున్న వైసీపీ నేతలు

ED Raids Ex-MP: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ ఇంట్లో ఈడీ సోదాలు, బెంబేలెత్తుతున్న వైసీపీ నేతలు

ED Raids Ex-MP: తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దూకుడు పెంచిందా? ఓ వైపు హైదరాబాద్.. మరోవైపు విశాఖపట్న రియల్టర్లపై ఫోకస్ చేసిందా? లేటెస్ట్‌గా విశాఖ మాజీ ఎంపీ వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. భూకబ్జాలు ఆరోపణల నేపథ్యంలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం.


శుక్రవారం సాయంత్రానికి విశాఖ చేరుకున్నారు ఈడీ అధికారులు. శనివారం ఉదయం లాసన్స్ బే కాలనీలోని ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లోనే ఫస్ట్ ఫ్లోర్‌లో తనిఖీలు చేపట్టారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు. అటు మధురువాడ లోని ఎంవీవీ సిటీ ఆఫీసులో సోదాలు చేస్తున్నారు. మాజీ ఎంపీతోపాటు ఆడిటర్ జీవీ ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు.

ఎంవీవీ సత్యనారాయణకి చెందిన  హైగ్రీవా ఇన్‌ఫ్రాటెక్ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. ఏకకాలంలో ఐదు చోట్ల సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా మధురవాడ భూమి కొనుగోలు కేసుతోపాటు రూ.12.5 కోట్ల లావాదేవీల వ్యవహారంలో ఎంవీవీపై ఈడీ కేసు నమోదు అయ్యింది. వాటిపై ఫోకస్ చేసినట్టు సమాచారం.


ఈడీ సోదాల విషయం తెలియగానే వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారట. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత, అధినేతకే కాదు తమకు కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు. వైసీపీ ఓటమి తర్వాత రాజకీయా ల నుంచి వైదొలగాలని ఎంవీవీ భావించారట. కాకపోతే కొన్ని కారణాల వల్ల సైలెంట్ అయిపోయారు.

ALSO READ: విశాఖ.. అధికారుల మొద్దు నిద్ర, ప్రభుత్వాలు మారినా మారని తీరు.. మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీలు

ఒక్కసారి వెనక్కి వెళ్తే.. విశాఖలో భూముల కబ్జా వ్యవహారంలో విజయసాయిరెడ్డిపై ఎంవీవీ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మళ్లీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్‌గా రావడం, ఎంవీవీ ఇంటిపై ఈడీ సోదాలు చేయడంపై ఆయన మద్దతుదారుల్లో అనుమానాలు మొదలయ్యాయి.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×