BigTV English
Advertisement

Vidadala rajini: నా కాల్ డేటాతో ఆయనకేం పని..? విడదల రజిని సంచలన ఆరోపణలు

Vidadala rajini: నా కాల్ డేటాతో ఆయనకేం పని..? విడదల రజిని సంచలన ఆరోపణలు

మాజీ మంత్రి విడదల రజిని ప్రస్తుత ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలుపై సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో ఆయన వైసీపీలో ఎంపీగా ఉన్నప్పుడు తన కాల్ డేటాను సేకరించారని అన్నారు. యతన కాల్ డేటాతో ఆయనకేం పని అని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా ఆయనకు తనపై కోపం ఉందని, ఆ కోపంతోనే తనను కేసుల్లో ఇరికించారని అన్నారు రజిని.



గత రెండు రోజులుగా మాజీ మంత్రి విడదల రజిని పేరు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆమె అక్రమాలకు పాల్పడ్డారని, స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు వినిపించాయి. ఆ ఆరోపణలు నిజమని నిర్థారించుకున్న ఏసీబీ ఆమెపై కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ దాఖలు కావడంతో రేపోమాపో విడదల రజిని అరెస్ట్ ఖాయమని అనుకుంటున్నారంతా. ఈ క్రమంలో ఆమె తనపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని విమర్శిస్తూ ట్వీట్ వేశారు. వంద కేసులను, వేయ్యి ప్రచారాలను సైతం తాను ఒంటి చేత్తో ఎదుర్కొంటానన్నారు. “మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు. వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు. ఒక మహిళ నైన నా పై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి వంద కేసులను, వేయి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కోడానికి నేను సిద్ధం. నా ధైర్యం నా నిజాయితీ నా ధైర్యం నేను నమ్మే సత్యం, ధర్మం. నేను ఎదురు చూస్తూ ఉంటా.నిజం బయట పడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడటానికి..” అని ట్వీట్ చేశారు.

ఆ తర్వాత సీన్ మరో మలుపు తిరిగింది. ఇది ప్రభుత్వ కుట్ర అంటూ ఇంత సేపూ చెప్పుకొచ్చిన విడదల రజిని, ఇప్పుడు మరో పేరు బయటకు తీసింది. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుకి తనపై కోపం ఉందని, ఆయనే ఇదంతా చేయించారని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించారు మాజీ మంత్రి రజిని.

అయితే ఆమె చెబుతున్న కాల్ డేటా సేకరణ సంఘటన వైసీపీ హయాంలో జరిగింది. అప్పట్లో ఆయనపై జగన్ కి ఫిర్యాదు చేయగా.. కాల్ డేటా సేకరణకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నారని చెప్పారు. అయితే అప్పుడే ఎంపీగా ఉన్న శ్రీకృష్ణ దేవరాయలుపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదో ఆమె చెప్పలేకపోయారు. ఆ వ్యవహారాన్ని అప్పుడు గుట్టుగా ఉంచి, ఇప్పుడు బయటపెట్టడంలో ఆమె ఉద్దేశమేంటని వైరి వర్గాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి.

అరెస్ట్ ఖాయం అనుకుంటున్న ఈ టైమ్ లో విడదల రజిని, ఒక ఎంపీపై సంచలన ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా మారింది. వారిద్దరి మధ్య గొడవని సరిగ్గా ఈ టైమ్ లో బయటపెట్టడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ఫిర్యాదు చేసిన వారితో తనకెలాంటి సంబంధం లేదని అంటున్నారు విడదల రజిని. ఏపీలో రెడ్‌ బుక్‌ అరాచకాలు తారాస్థాయికి చేరాయని విమర్శించారు. తనపై ఏసీబీ అక్రమంగా కేసు నమోదు చేసిందని, కూటమి నేతల బెదిరింపులకు తాను భయపడేది లేదన్నారామె. ప్రజలకు సేవ చేయడానికి తాను రాజకీయాల్లోకి వస్తే, రెడ్ బుక్ పాలనలో తనను టార్గెట్ చేశారని అన్నారు. ఒక బీసీని, ఒక మహిళను.. నన్ను ఇంతగా టార్గెట్ చేస్తారా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

Kashibugga: కాశీబుగ్గ దుర్ఘటన.. మృతుల కుటుంబాలకు 15 లక్షల ఎక్స్‌గ్రేషియా

Kasibugga Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే: మాజీ సీఎం జగన్

Parakamani: పరకామణి కేసులో ఊహించని ట్విస్టులు..

ISRO LVM3-M5 Mission: ఇస్రో బాహుబలి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్.. రేపు సాయంత్రం నింగిలోకి LVM3-M5

P.V.N. Madhav: మాధవ్ వన్‌మాన్ షో.. ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది?

CM Chandrababu: నిద్రలో కూడా ప్రజల గురించే ఆలోచిస్తా.. ఇదే నా విజన్: సీఎం చంద్రబాబు

Srikakulam News: కాశీబుగ్గ టెంపుల్ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉంది.. ఘటనపై మంత్రి ఆనం స్పందన ఇదే..

Stampede At Kasibugga: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా

Big Stories

×