E-Paper
Advertisement

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!
Advertisement

Prashanth Reddy: కవిత వాక్యాలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. నేను వారిని విడదీయటానికి ప్రయత్నించానా కలపటానికి ప్రయత్నించానా కెసిఆర్‌కు తెలుసని అన్నారు. కవిత మొండిగా వ్యవహరించి పార్టీ లైన్ దాటారు కాబట్టే పార్టీ నుండి తొలగించారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీ ఆర్ ఎస్ పార్టీకి వ్యవస్థాపక సభ్యులం మేమని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం జరిగిన చర్చల్లో మాది ప్రముఖ పాత్ర ఉందన్నారు.

ముప్పై మూడేళ్లుగా పోరాటం..

బీఆర్ఎస్ అంటే ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటే బీఆర్ఎస్ కవిత మధ్యలో వచ్చి మధ్యలో వెళ్లి పోయారు. ఈ కష్ట కాలంలో కెసిఆర్‌కు అండగా ఉన్నది కవిత నా నేనా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముప్పై మూడేళ్లుగా పోరాటం చేస్తున్నది ఓవరో తెలుసని అన్నారు. ఎవరితోనూ మంతనాలు జరపలేదని లక్షి నరసింహ స్వామి సన్నిధిలో చెప్తున్నని అన్నారు.

Advertisement

Also read: ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

కవితకు సవాల్..

రహస్యంగా కాంగ్రెస్ పార్టీ వారిని కలవలేదని చెప్పగలరా నిరాధార ఆరోపణలు చేయటం మంచిది కాదని అన్నారు. కెసిఆర్‌కు పార్టీకి దగ్గరగా ఉన్న వారిని టార్గెట్ చేసి తద్వారా నాయకత్వాన్ని బలహీన పరిచయమే కవిత లక్ష్యం అంటూ ఫైర్ అయ్యారు. జనం ముందు కన్నీరు పెట్టుకోవటం సానుభూతి కోసమా ఎందుకో ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నానన్నారు. కానీ కవిత చేసే ఇలాంటి పనుల వల్ల కెసిఆర్ ఎంత మనోవేదనకు గురి అవుతున్నారో ఆలోచన చేయాలన్నారు.

ఉన్న కాస్త గౌరవం..

Advertisement

కన్న తండ్రినే దుర్భాషలు అన్న మీరు నన్ను అనటం ఒక లెక్క కాదు. కానీ నాకు బాధగా ఉంది. వారితో కలిసి పనిచేసాను మీ గెలుపులో నా పాత్ర ఏంటో కెసిఆర్‌కు తెలుసని అన్నారు. సమాజంలో కవితకు ఉన్న కాస్త గౌరవం కూడా పోయింది. కవిత అధికార పక్షానికి లాభం చేసేందుకు పనిచేస్తున్నారో ప్రజలకు తెలుసని అన్నారు. గెలుపు ఓటములు ప్రజల చేతిలో ఉంటుందని ఆయన అన్నారు.

Also read: ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

Tags

Related News

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

మేడ్చల్ ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన లారీ!

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. సాయంత్ర కేసీ వేణుగోపాల్‌తో సమావేశం, హస్తినకు కొందరు నేతలు పయనం

“చెరువులను మింగేసే వాళ్ల ఆటలు సాగవ్!”.. అంబర్‌పేట్ వేదికగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×