E-Paper
Advertisement

Clashes between students in Eluru: ఏలూరు స్కూల్‌లో దారుణం.. తోటి విద్యార్థిపై పెట్రోల్ పోసి.. ఆ తర్వాత

Clashes between students in Eluru: ఏలూరు స్కూల్‌లో దారుణం.. తోటి విద్యార్థిపై పెట్రోల్ పోసి.. ఆ తర్వాత

Clashes between students in Eluru: విద్యార్థుల మధ్య ఏం జరిగిందో తెలీదు.. ఓ విద్యార్థిపై మరొకరు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు మరో విద్యార్థి. గాయాలపాలైన ఆ విద్యార్థిని నిర్వాహకులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. సంచలనం రేపిన ఈ ఘటన ఏలూరులో చోటు చేసుకుంది.

ఉండి మండలానికి చెందిన ఓ బాలుడు ఏలూరులోని జేవియర్ హైస్కూల్‌లో చదువుతున్నాడు. దానికి అనుబంధంగా హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆ గదిలోనే మరో స్టూడెంట్ ఉంటున్నారు. ఇద్దరి మధ్య దోమల చక్రం విషయంలో గొడవ తలెత్తినట్టు తెలుస్తోంది. చివరకు నువ్వెంత అంటే నువ్వెంత అనేస్థాయికి వెళ్లింది.

ఓ విద్యార్థి పట్టరాని కోపంతో సీసాతో తెచ్చిన పెట్రోల్‌ని తోటి విద్యార్థిపై పోసి నిప్పుంటించాడు. మంటలు రావడం గమనించిన సీనియర్ స్టూడెంట్స్ వెంటనే మంటలు ఆర్పి నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. గాయాలపాలైన విద్యార్థి సుధీర్‌పాల్‌ని వెంటనే ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆ విద్యార్థి అక్కడ చికిత్స తీసుకుంటున్నాడు. విద్యార్థి నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పెట్రోల్ పోసిన బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ: ‘రాజకీయ నేతలు తప్పు చేస్తే శిక్షలు ఉండవా..?’

వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలే ఈ ఘటనకు దారి తీసిందని తోటి విద్యార్థులు చెబుతున్నమాట. అంతేకాదు పెట్రోల్ పోసిన విద్యార్థి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. మరి పోలీసులు విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×