E-Paper
Advertisement

Clashes between students in Eluru: ఏలూరు స్కూల్‌లో దారుణం.. తోటి విద్యార్థిపై పెట్రోల్ పోసి.. ఆ తర్వాత

Clashes between students in Eluru: ఏలూరు స్కూల్‌లో దారుణం.. తోటి విద్యార్థిపై పెట్రోల్ పోసి.. ఆ తర్వాత
Advertisement

Clashes between students in Eluru: విద్యార్థుల మధ్య ఏం జరిగిందో తెలీదు.. ఓ విద్యార్థిపై మరొకరు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు మరో విద్యార్థి. గాయాలపాలైన ఆ విద్యార్థిని నిర్వాహకులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. సంచలనం రేపిన ఈ ఘటన ఏలూరులో చోటు చేసుకుంది.

ఉండి మండలానికి చెందిన ఓ బాలుడు ఏలూరులోని జేవియర్ హైస్కూల్‌లో చదువుతున్నాడు. దానికి అనుబంధంగా హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆ గదిలోనే మరో స్టూడెంట్ ఉంటున్నారు. ఇద్దరి మధ్య దోమల చక్రం విషయంలో గొడవ తలెత్తినట్టు తెలుస్తోంది. చివరకు నువ్వెంత అంటే నువ్వెంత అనేస్థాయికి వెళ్లింది.

Advertisement

ఓ విద్యార్థి పట్టరాని కోపంతో సీసాతో తెచ్చిన పెట్రోల్‌ని తోటి విద్యార్థిపై పోసి నిప్పుంటించాడు. మంటలు రావడం గమనించిన సీనియర్ స్టూడెంట్స్ వెంటనే మంటలు ఆర్పి నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. గాయాలపాలైన విద్యార్థి సుధీర్‌పాల్‌ని వెంటనే ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆ విద్యార్థి అక్కడ చికిత్స తీసుకుంటున్నాడు. విద్యార్థి నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పెట్రోల్ పోసిన బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ALSO READ: ‘రాజకీయ నేతలు తప్పు చేస్తే శిక్షలు ఉండవా..?’

వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలే ఈ ఘటనకు దారి తీసిందని తోటి విద్యార్థులు చెబుతున్నమాట. అంతేకాదు పెట్రోల్ పోసిన విద్యార్థి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. మరి పోలీసులు విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×