BigTV English
Advertisement

Clashes between students in Eluru: ఏలూరు స్కూల్‌లో దారుణం.. తోటి విద్యార్థిపై పెట్రోల్ పోసి.. ఆ తర్వాత

Clashes between students in Eluru: ఏలూరు స్కూల్‌లో దారుణం.. తోటి విద్యార్థిపై పెట్రోల్ పోసి.. ఆ తర్వాత

Clashes between students in Eluru: విద్యార్థుల మధ్య ఏం జరిగిందో తెలీదు.. ఓ విద్యార్థిపై మరొకరు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు మరో విద్యార్థి. గాయాలపాలైన ఆ విద్యార్థిని నిర్వాహకులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. సంచలనం రేపిన ఈ ఘటన ఏలూరులో చోటు చేసుకుంది.


ఉండి మండలానికి చెందిన ఓ బాలుడు ఏలూరులోని జేవియర్ హైస్కూల్‌లో చదువుతున్నాడు. దానికి అనుబంధంగా హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆ గదిలోనే మరో స్టూడెంట్ ఉంటున్నారు. ఇద్దరి మధ్య దోమల చక్రం విషయంలో గొడవ తలెత్తినట్టు తెలుస్తోంది. చివరకు నువ్వెంత అంటే నువ్వెంత అనేస్థాయికి వెళ్లింది.

ఓ విద్యార్థి పట్టరాని కోపంతో సీసాతో తెచ్చిన పెట్రోల్‌ని తోటి విద్యార్థిపై పోసి నిప్పుంటించాడు. మంటలు రావడం గమనించిన సీనియర్ స్టూడెంట్స్ వెంటనే మంటలు ఆర్పి నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. గాయాలపాలైన విద్యార్థి సుధీర్‌పాల్‌ని వెంటనే ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.


ప్రస్తుతం ఆ విద్యార్థి అక్కడ చికిత్స తీసుకుంటున్నాడు. విద్యార్థి నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పెట్రోల్ పోసిన బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ: ‘రాజకీయ నేతలు తప్పు చేస్తే శిక్షలు ఉండవా..?’

వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలే ఈ ఘటనకు దారి తీసిందని తోటి విద్యార్థులు చెబుతున్నమాట. అంతేకాదు పెట్రోల్ పోసిన విద్యార్థి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. మరి పోలీసులు విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×