E-Paper
Advertisement

Flexi Banner Controversy: ఫ్లెక్సీ వార్.. సీఐపై రెచ్చిపోయిన కారుమూరి.. తణుకు వై జంక్షన్ వద్ద హైటెన్షన్!

Flexi Banner Controversy: ఫ్లెక్సీ వార్.. సీఐపై రెచ్చిపోయిన కారుమూరి.. తణుకు వై జంక్షన్ వద్ద హైటెన్షన్!
Advertisement

Flexi Banner Controversy: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రాజకీయ సెగలు రేగాయి. పట్టణంలోని కీలక ప్రాంతమైన వై జంక్షన్ వద్ద ఫ్లెక్సీల ఏర్పాటు వ్యవహారం కాస్తా, అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అనుచరులు వైఎస్ఆర్ విగ్రహం సమీపంలో శుభాకాంక్షల ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం ఈ వివాదానికి దారితీసింది.

ఈ పరిణామంపై మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద టీడీపీ నేతల ఫ్లెక్సీలు పెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన అనుచరులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని నిరసన చేపట్టారు. అయితే, అక్కడే ఉన్న పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఒకానొక దశలో మాజీ మంత్రి, పోలీసు అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

Advertisement

నిరసన సమయంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న తణుకు రూరల్ సీఐపై మాజీ మంత్రి కారుమూరి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. “ఖైదీ డ్రెస్ తీసేసి పచ్చ చొక్కా వేసుకో.. ఇంత ఊడిగం చేస్తావా?” అంటూ ఆయన పోలీసు అధికారిపై విరుచుకుపడటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విధుల్లో ఉన్న బాధ్యతాయుతమైన అధికారిని ఉద్దేశించి అటువంటి పదజాలం వాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై కూటమి నేతలు తీవ్రంగా స్పందించారు. పదవిలో ఉన్నా లేకపోయినా పోలీసు యంత్రాంగం పట్ల గౌరవం ఉండాలని, చట్టాన్ని గౌరవించాల్సిన మాజీ మంత్రి ఇలా బహిరంగంగా దూషించడం ఆయన అహంకారానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన కారుమూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: చంద్రబాబు నిజంగానే జగన్‌ను ఫాలో అవుతున్నారా?

ప్రస్తుతం తణుకు వై జంక్షన్ వద్ద పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. సెక్షన్ 30 అమలులో ఉందని, ఎవరూ నిబంధనలు ఉల్లంఘించకూడదని హెచ్చరికలు జారీ చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అదనపు బలగాలను రంగంలోకి దింపి పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×