E-Paper
Advertisement

Viveka Case : సుప్రీంకోర్టు డెడ్ లైన్.. ఆ అధికారిపై సీబీఐ వేటు.. సిట్ ఏర్పాటు..

Viveka Case : సుప్రీంకోర్టు డెడ్ లైన్.. ఆ అధికారిపై సీబీఐ వేటు.. సిట్ ఏర్పాటు..
Advertisement

Viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్‌ 30లోపు దర్యాప్తు ముగించాలని సీబీఐను సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసులో కుట్ర కోణాన్ని బయటపెట్టాలని నిర్దేశించింది. ఇప్పటికే ఈ కేసు విచారణ ఆలస్యమైందని పేర్కొంది. అందుకే దర్యాప్తు పూర్తి చేయడానికి కాలపరిమితిని విధిస్తున్నామని స్పష్టం చేసింది.

మరోవైపు వివేకా హత్యలో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ పై వేటు వేసింది. ఆయనను విచారణ బాధ్యతల నుంచి తప్పించింది. అలాగే ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. సీబీఐ ఇచ్చిన సిట్ ఏర్పాటు ప్రతిపాదనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఈ సిట్‌కు సీబీఐ డీఐజీ కె.ఆర్‌.చౌరాసియా నాయకత్వం వహిస్తారు. సిట్‌ బృందంలో ఎస్పీ వికాస్‌ సింగ్‌, అడిషనల్‌ ఎస్పీ ముఖేశ్‌ కుమార్‌, ఇన్‌స్పెక్టరు ఎస్. శ్రీమతి, నవీన్‌ పునియా, ఎస్ఐ అంకిత్‌ యాదవ్‌ సభ్యులుగా ఉంటారు.

Advertisement

వివేకా హత్య కేసులో ఏ5 నిందితుడు శివశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్ ను సుప్రీకోర్టు తిరస్కరించింది. శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన భార్య తులసమ్మ ఈ పిటిషన్ దాఖలు చేసింది. 6 నెలల్లోపు ట్రయల్‌ మొదలుకాకపోతే సాధారణ బెయిల్ పిటిషన్‌ వేసుకునే అవకాశాన్ని న్యాయస్థానం కల్పించింది. అయితే మెరిట్స్‌ ఆధారంగానే బెయిల్‌పై నిర్ణయం ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ ఆదేశాల ప్రభావం బెయిల్‌ పిటిషన్‌పై ఉండదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

కొత్తగా సీబీఐ ఏర్పాటు చేసిన సిట్ బృందం వివేకా హత్యకేసు దర్యాప్తును సుప్రీంకోర్టు విధించిన గడువు ప్రకారం ఏప్రిల్ 30లోపు పూర్తి చేస్తుందా..?

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×