BigTV English
Advertisement

Viveka Case : సుప్రీంకోర్టు డెడ్ లైన్.. ఆ అధికారిపై సీబీఐ వేటు.. సిట్ ఏర్పాటు..

Viveka Case : సుప్రీంకోర్టు డెడ్ లైన్.. ఆ అధికారిపై సీబీఐ వేటు.. సిట్ ఏర్పాటు..

Viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్‌ 30లోపు దర్యాప్తు ముగించాలని సీబీఐను సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసులో కుట్ర కోణాన్ని బయటపెట్టాలని నిర్దేశించింది. ఇప్పటికే ఈ కేసు విచారణ ఆలస్యమైందని పేర్కొంది. అందుకే దర్యాప్తు పూర్తి చేయడానికి కాలపరిమితిని విధిస్తున్నామని స్పష్టం చేసింది.


మరోవైపు వివేకా హత్యలో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ పై వేటు వేసింది. ఆయనను విచారణ బాధ్యతల నుంచి తప్పించింది. అలాగే ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. సీబీఐ ఇచ్చిన సిట్ ఏర్పాటు ప్రతిపాదనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఈ సిట్‌కు సీబీఐ డీఐజీ కె.ఆర్‌.చౌరాసియా నాయకత్వం వహిస్తారు. సిట్‌ బృందంలో ఎస్పీ వికాస్‌ సింగ్‌, అడిషనల్‌ ఎస్పీ ముఖేశ్‌ కుమార్‌, ఇన్‌స్పెక్టరు ఎస్. శ్రీమతి, నవీన్‌ పునియా, ఎస్ఐ అంకిత్‌ యాదవ్‌ సభ్యులుగా ఉంటారు.

వివేకా హత్య కేసులో ఏ5 నిందితుడు శివశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్ ను సుప్రీకోర్టు తిరస్కరించింది. శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన భార్య తులసమ్మ ఈ పిటిషన్ దాఖలు చేసింది. 6 నెలల్లోపు ట్రయల్‌ మొదలుకాకపోతే సాధారణ బెయిల్ పిటిషన్‌ వేసుకునే అవకాశాన్ని న్యాయస్థానం కల్పించింది. అయితే మెరిట్స్‌ ఆధారంగానే బెయిల్‌పై నిర్ణయం ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ ఆదేశాల ప్రభావం బెయిల్‌ పిటిషన్‌పై ఉండదని న్యాయస్థానం స్పష్టం చేసింది.


కొత్తగా సీబీఐ ఏర్పాటు చేసిన సిట్ బృందం వివేకా హత్యకేసు దర్యాప్తును సుప్రీంకోర్టు విధించిన గడువు ప్రకారం ఏప్రిల్ 30లోపు పూర్తి చేస్తుందా..?

Related News

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

Big Stories

×