BigTV English
Advertisement

Hyderabad: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు

Hyderabad: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు

Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. నిన్న రాత్రి 11 గంటలకు వియత్నాం వెళ్లాల్సిన ఎయిర్ బస్ ఇప్పటి వరకు రాలేదు. దీంతో 200మంది ప్రయాణికులు రాత్రి నుండి ఆందోళన చేస్తున్నారు.


వియత్నాం ఎయిర్ బస్‌ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వడం లేదంటున్నారు. ఫ్లైట్‌ ఎప్పుడు టేకాఫ్‌ అవుతుందో చెప్పడం లేదు. సాంకేతిక సమస్య వల్లే విమానం టేకాఫ్ కాలేదని సమాచారం. తామేం చేయలేమని విమానాశ్రయం అధికారులు చేతులెత్తేశారు.

ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ప్రయాణికుల్లో చాలామంది వియత్నాం పర్యాటకులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులే ఉన్నార. ఇప్పుడు వారి షెడ్యూల్స్ దెబ్బతిన్నాయి. ఒక ప్రయాణికుడు “రాత్రంతా పడిగా పడుకున్నాం, ఆహారం కూడా సరిగా దొరకలేదు.


ఎయిర్‌లైన్స్ ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు” అని ఫిర్యాది చేశారు. ఈ ఆలస్యం వల్ల ప్రయాణికులు మాత్రమే కాకుండా, వారి కుటుంబాలు కూడా ఆందోళన చెందారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఇలాంటి ఆలస్యాలు సాధారణం.. కానీ, తామేం చేయలేమని విమానాశ్రయం అధికారులు చేతులెత్తేశారు.. దీంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు ప్రయాణికులు..

Related News

Revanth Reddy Birthday: అభిమాని బర్త్ డే గిఫ్ట్.. ట్యాంక్ బండ్ పై సీఎం రేవంత్ సైకత శిల్పం

Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లకు విస్తరణ: మంత్రి కోమటిరెడ్డి

Flying Squad Raids: కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదు..? జూబ్లీ హిల్స్‌లో ఈసీ రైడ్స్

CM Revanth Reddy: సీఎం రేవంత్ పుట్టినరోజు.. PM నుండి CM వరకు శుభాకాంక్షలు

Jubilee Hills By Elections: ఫైనల్‌ స్టేజ్‌కు జూబ్లీహిల్స్‌ బైపోల్‌ క్యాంపెయినింగ్‌.. రేపు సాయంత్రానికి ప్రచారం క్లోజ్‌

Sridhar Babu: యూట పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Big Stories

×