E-Paper
Advertisement

Dokka Manikya Varaprasad: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ మంత్రి..

Dokka Manikya Varaprasad: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ మంత్రి..
Advertisement

వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో డొక్కా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వైసీపీపై అసంతృప్తితో పార్టీ సభ్యత్వానికి, గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపారు. వైసీపీకి రాజీనామా చేసి.. కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన టీడీపీలో చేరారు. ఆయనను పార్టీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.

Advertisement

వైసీపీ అధిష్ఠానం డొక్కా మాణిక్య వరప్రసాద్ కు టికెట్ కేటాయించపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అయితే టీడీపీ కూడా ఇప్పటికే పొత్తులో భాగంగా అన్ని అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో మాజీ మంత్రి డొక్కాకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ కేటాయించే అవకాశం దాదాపు అసాధ్యం అనే చెప్పుకోవచ్చు.

Also Read: టీడీపీకి షాక్.. వైసీపీ గూటికి యనమల కృష్ణుడు

Advertisement

టీడీపీ అధినేత చంద్రబాబు.. డొక్కా మాణిక్య వరప్రసాద్ కు ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. డొక్కాకు ఎమ్మెల్సీ పదవి ఫిక్స్ అంటూ గుంటూరులో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే టీడీపీ.. జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో డొక్కాకు ఏ పదవి కేటాయిస్తుందో వేచి చూడాల్సిందే.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×