E-Paper
Advertisement

Lok Sabha Elections 2024: దేశ వ్యాప్తంగా ముగిసిన రెండో విడత పోలింగ్.. 61 శాతం ఓటింగ్..!

Lok Sabha Elections 2024: దేశ వ్యాప్తంగా ముగిసిన రెండో విడత పోలింగ్.. 61 శాతం ఓటింగ్..!
Advertisement

Second Phase Voting: దేశవ్యాప్తంగా రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 88 లోక్ సభ స్ఠానాలకు రెండో దశలో పోలింగ్ జరిగింది. దేశంలోని 13 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదైన్లట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

పలు చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా మిగిసింది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగిసింది. పోలింగ్ సమయం ముగిసినప్పటికీ క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అయితే సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా 61 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

సాయంత్రం 5 గంటల వరకు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన సమాచారం ప్రకారం.. అస్సాంలో 70.66 శాతం పోలింగ్ నమోదైంది. ఛత్తీస్ గఢ్ లో 72.13 శాతం, జమ్ముకశ్మీర్ లో 67.22 శాతం. కర్ణాటకలో 63.90 శాతం, బిహార్ లో 53.03 శాతం, కేరళలో 63.97, మధ్యప్రదేశ్ 54.83, మహారాష్ట్ర 53.51, మణిపుర్ 76.06, రాజస్థాన్ 59.19, త్రిపుర 77.53, ఉత్తరప్రదేశ్ 52.74, పశ్చిమబంగాల్ 71.84 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Also Read: నోటాకు అత్యధిక ఓట్లు వస్తే ఏమవుతుంది.? ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసు

Advertisement

కాగా, మే 7వ తేదీన మూడో దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అయితే మొత్తం 7 దశల్లో ఈసారి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

Tags

Related News

ఆసుపత్రి నుంచే సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ.. ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పుతో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×