Big Stories

Dokka Manikya Varaprasad: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా

Dokka Manikya Varaprasad: ఎన్నికల వేళ రాష్ట్ర అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు.

- Advertisement -

గుంటూరులో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ పార్టీ సభ్యత్వంతో పాటుగా గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి కూడా డొక్కా రాజీనామా చేశారు.

- Advertisement -

డొక్కా మాణిక్య వరప్రసాద్ తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపారు. వైసీపీ అధిష్ఠానం తనకు టికెట్ కేటాయించకపోవడంతో ఆయన పార్టీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ తాడికొండ టికెట్ ఆశించారు కానీ ఆయనకు అధిష్ఠానం టికెట్ కేటాయించలేదు.

తాడికొండ టికెట్ ను వైసీపీ అధిష్ఠానం మాజీ మంత్రి మేకతోటి సుచరితకు కేటాయించింది. దీంతో గతకొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దురంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన ఏ పార్టీలో చేరుతారు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News