E-Paper
Advertisement

Kuthuhalamma : మాజీ మంత్రి కుతూహలమ్మ కన్నుమూత..

Kuthuhalamma : మాజీ మంత్రి కుతూహలమ్మ కన్నుమూత..
Advertisement

Kuthuhalamma : మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని ఆమె నివాసంలో తెల్లవారుజామున మృతిచెందారు. ఆమె ఉన్నత విద్యావంతురాలు.

వైద్యురాలైన కుతూహలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. చిత్తూరు జిల్లా
పరిషత్‌ అధ్యక్షురాలిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1985లో వేపంజేరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి మరో మూడుసార్లు 1989, 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో జీడీనెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Advertisement

రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కుతూహలమ్మ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కేబినెట్ లో 1991-93 మధ్య వైద్యారోగ్య, శిశు, సంక్షేమశాఖ మంత్రిగా సేవలందించారు. 2007 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు. కాంగ్రెస్ కేంద్ర కమిటీలో కుతూహలమ్మకు స్థానం దక్కింది. ఆమె ఏఐసీసీ సభ్యురాలుగా 1992 నుంచి 1997 వరకు పని చేశారు. సుధీర్ఘకాలం ఆమె కాంగ్రెస్ లో కొనసాగారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×