Hackers: హ్యాకింగ్ అనేది ఈరోజుల్లో విపరీతంగా పెరిగిపోతోంది. టెక్నికల్ అనుభవం లేని వారు కూడా హ్యాకింగ్ను నేర్చుకుంటున్నారు. ఇక టెక్నికల్ ఫీల్డ్పై అవగాహన ఉన్నవారు హ్యాకింగ్లో నిపుణులు అయిపోతున్నారు. ఈ హ్యాకింగ్ వల్ల ప్రభుత్వాలు కూడా చిక్కుల్లో పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్పై హ్యాకర్ల కన్నుపడింది. హ్యాక్ చేయడంతో పాటు ఆ సమాచారం బయటికి రాకుండా ఉండడానికి వారు భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
హైఫాలోని ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైబర్ అటాక్కు గురయ్యిందని తాజాగా బయటపెట్టింది. టెక్నియన్గా పిలవబడే ఈ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ నుండి అందరూ లాగ్ ఆఫ్ అవ్వాలని తెలియని యూజర్ నుండి విద్యార్థులకు సమాచారం అందింది. ఉన్నట్టుండి టెక్నియన్ నుండి లాగ్ ఆఫ్ అవ్వాలని మెసేజ్ వచ్చిందని, అందుకే తామంతా లాగ్ ఆఫ్ అయ్యామని, పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఇలా జరగడం బాధాకరం అని విద్యార్థులు వాపోతున్నారు.
డార్క్ బిట్ అనే గ్రూప్ ద్వారా ఇన్స్టిట్యూట్ సైబర్ అటాక్కు గురయ్యిందని ఒక న్యూస్ సైట్ వెల్లడించింది. అంతే కాకుండా హ్యాకర్లు టెక్నియన్ నుండి 80 బిట్కాయిన్స్ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. అంటే దాని విలువ దాదాపు 1,747,971 డాలర్లు. ప్రతీ ఏడాది వేలమంది ఇంజనీర్లను తయారు చేసి వివిధ రంగాల్లో వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే ఇజ్రాయిల్ ఇన్స్టిట్యూట్ వల్ల ఇలా జరగడంతో యాజమాన్యం.. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు తెలిపారు.
టెక్నియన్ హ్యాక్ అయ్యిందని, జాతులలో తేడాలు చూపించడం వల్లే హ్యాకర్లు ఇలా చేశారని యాజమాన్యం తన తప్పును బహిరంగంగా ఒప్పుకుంది. ప్రస్తుతం ఇన్స్టిట్యూట్లో ఏ సిస్టమ్ కూడా ఉపయోగించడానికి సహకరించడం లేదని, దాంతో పాటు వాటి నుండి ఎంతో సమాచారం దొంగలించబడిందని వారు తెలిపారు. తమపై నమ్మకం పెట్టుకున్న వారందరికీ క్షమాపణలు తెలిపారు. మరోవైపు సైబర్ టీమ్ కూడా ఈ విషయంపై విచారణ చేపట్టింది.