BigTV English
Advertisement

Ganta Srinivasa Rao : ఒంగోలు నుంచి గంటా పోటీ? ఇదేం ట్విస్ట్..?

Ganta Srinivasa Rao : ఒంగోలు నుంచి గంటా పోటీ? ఇదేం ట్విస్ట్..?


Ganta Srinivasa Rao : గంటా శ్రీనివాస్ ఒంగోలు నుంచి పోటీ చేయబోతున్నారా? ఊహకే అందని విషయం ఇది. చంద్రబాబు కుప్పం వదిలేస్తారంటే నమ్మొచ్చేమో. జగన్ పులివెందుల నుంచి పోటీ చేయరంటే నమ్మొచ్చేమో. కాని గంటా శ్రీనివాస్ విశాఖ వదిలి రావడం అసంభవం. మరి ఎందుకని ఈ టాక్ నడుస్తోంది. నిజానికి గంటా శ్రీనివాస్ ఒక నియోజకవర్గానికే పరిమితం అయిన వ్యక్తి కాదు. విశాఖలోనే నియోజకవర్గాలు మారుతూ పోటీ చేస్తూ వచ్చారు. అలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టే.. ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారనే వార్తను ఓ సెక్షన్ నమ్ముతోంది. ఇంతకీ ఇందులో నిజం ఎంత?

నిప్పులేనిదే పొగ రాదంటారు. గంటా శ్రీనివాస్ విశాఖ వదలేసి ఒంగోలుకు షిఫ్ట్ అవుతున్నారన్న దానిపై ఒక్క టీడీపీలోనే కాదు అధికార వైసీపీలోనూ డిస్కషన్ జరుగుతోంది. గంటా ఈసారి నియోజకవర్గాన్ని మారుస్తారట, ఒంగోలు వెళ్లిపోతారట అని మాట్లాడుకుంటున్నారు. అయితే, ఈ ప్రతిపాదన టీడీపీ అధిష్టానం నుంచి వచ్చిందా లేక గంటా శ్రీనివాస్ నుంచి వచ్చిందా అన్నది క్లారిటీ రాలేదు. ఓ సెక్షన్ చెబుతున్నది ఏంటంటే.. గంటా శ్రీనివాసే ఒంగోలును ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. అదే సమయంలో అది అంత ఈజీ కాదనే టాక్ కూడా నడుస్తోంది. ఒకవేళ ఒంగోలు నుంచి పోటీ చేస్తానన్నా ఒప్పుకునే పరిస్థితి లేదంటున్నారు. ఆల్రడీ ఎప్పటి నుంచో అక్కడ లీడర్లు పాతుకుపోయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒంగోలుకు మరొకరిని రానిచ్చే పరిస్థితి లేదు. అయితే, అసలు ప్రశ్న ఏంటంటే.. ఇంతకీ గంటా శ్రీనివాస్ విశాఖ జిల్లాను ఎందుకు వదిలేయాలని అనుకుంటున్నారు?


గంటా శ్రీనివాస్ హోమ్ టౌన్ ఒంగోలు జిల్లా కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరు. అక్కడే పుట్టి, అక్కడే చదువుకున్నారు. బిజినెస్ అండ్ పాలిటిక్స్ కోసం విశాఖలో సెటిల్ అయిపోయారు. అందుకే, మళ్లీ హోమ్ టౌన్‌కి వెళ్లాలనుకుంటున్నారా లేదా అధిష్టానమే పంపించాలనుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది. బట్.. ఒంగోలు ఎంపీ స్థానానికి గంటా శ్రీనివాస్ పోటీ చేయబోతున్నారనే టాక్ మాత్రం గట్టిగా నడుస్తోంది. ఒంగోలు నుంచి పోటీ చేస్తే కాపు కమ్యూనిటీతో పాటు లోకల్స్ కూడా గంటాకు గట్టి సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉందని మాట్లాడుకుంటున్నారు. 

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×