E-Paper
Advertisement

GSLV-F14 : ఇస్రో కీర్తికిరీటంలో మరో కీలక ప్రయోగం.. GSLV-F14 సర్వం సిద్ధం

GSLV-F14 : ఇస్రో కీర్తికిరీటంలో మరో కీలక ప్రయోగం.. GSLV-F14 సర్వం సిద్ధం
Advertisement
GSLV-F14 launch update

GSLV-F14/INSAT-3DS Mission: ప్రతిష్టాత్మక జిఎస్‌ఎల్వి-ఎఫ్‌ 14 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభమైన కౌంట్‌ డౌన్‌ ప్రక్రియ ఇవాళ సాయంత్రం 5గంటల 35 నిమిషాలకు జిఎస్‌ఎల్వి-ఎఫ్‌ 14ను నింగిలోకి పంపడం ద్వారా ముగియనుంది. సరిగ్గా 27 గంటల 30 నిమిషాల పాటు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ కొనసాగనుంది. షార్‌ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్‌ ద్వారా ఇన్‌శాట్‌-3డిఎస్‌ను ఇస్రో పంపనుంది.

ఇస్రో కీర్తి కిరీటంలో ఈ ఉపగ్రహం మరో కీలకమైన ప్రయోగంగా భావిస్తున్నారు. ఇప్పటికే పలు ఇన్సాట్‌ తరహా ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఎప్పటికప్పుడు వాతావరణంలో జరిగే మార్పులు గమనించి భూ కేంద్రాలకు కచ్చితమైన సమాచారం అందించడానికి కేంద్రం ప్రభుత్వ ఎర్త్‌ సైన్సెస్‌ శాఖ కోసం ఈ ప్రయోగాన్ని జరుపుతున్నారు.

Advertisement

వాతావరణ సంబంధమైన అంశాలను అధ్యయనం చేసేందుకు ప్రయోగిస్తున్న ఈ ఉపగ్రహం బరువు 2275 కేజీలుగా ఉంది. పీఎస్‌ఎల్ వీ రాకెట్‌ ను నాలుగు దశల్లో ప్రయోగిస్తే జిఎస్‌ఎల్వీని మూడు దశలోనే ప్రయోగించనున్నారు. 51.7 మీటర్ల పొడవైన జిఎస్‌ఎల్‌వి-ఎఫ్‌ 14 రాకెట్‌ ప్రయోగ సమయంలో 420 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి బయలుదేరనుంది.

Read More:  ఫైబర్‌నెట్ కేసులో కేసులో సీఐడీ దూకుడు.. ఏ1గా చంద్రబాబు

Advertisement

వాతావరణ అంచనాలు, విపత్తులను ముందుగా హెచ్చరించడానికి ఇది ఉపయోగపడుతుంది. జీఎస్‌ఎల్‌వి మార్కు2 సిరీస్‌లో ఇది 16వ ప్రయోగం కావడం విశేషం. జీఎస్ఎల్వి -ఎఫ్ 14 ప్రయోగ నేపథ్యంలో షార్ లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇస్రో ప్రధాన శాస్త్రవేత్తలు ఇప్పటికే శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రానికి చేరుకున్నారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×