E-Paper
Advertisement

AP Fibernet Case: ఫైబర్‌నెట్ కేసులో కేసులో సీఐడీ దూకుడు.. ఏ1గా చంద్రబాబు!

AP Fibernet Case: ఫైబర్‌నెట్ కేసులో కేసులో సీఐడీ దూకుడు.. ఏ1గా చంద్రబాబు!
Advertisement
chandrababu in fibernet case

Charge Sheet on Chandrababu in Fibernet Case: ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏసీబీ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. A-1గా టిడిపి అధినేత చంద్రబాబును, A-2గా వేమూరి హరికృష్ణ పేర్లను సీఐడీ నమోదు చేసింది. ఇక A-3గా కోగంటి సాంబశివరావును చేర్చింది. ఐపీసీ 166,167,418, 465, 468, 471, 409, 506, రెడ్ విత్ 120(బి), ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టంలోని 13(2), రెడ్ విత్ 13(1)(సీ)(డీ) సెక్షన్ల కింద ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు. ఇందుకు సంబంధించిన ఛార్జిషీటును శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. అందులో.. ఫైబర్ నెట్ మొదటిదశలో కుంభకోణం జరిగినట్లుగా పేర్కొన్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు.. నేరపూరితమైన ఆలోచనతోనే గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా వి.హరికృష్ణప్రసాద్ ను నియమించారని, ప్రాజెక్ట్ అంచనా, వస్తువులకు మార్కెట్లో ఉన్న ధరలను పరిశీలించకుండానే అనుమతులు ఇచ్చారని ఛార్జిషీటులో పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించి మరీ బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెరాసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి టెండర్ ను కట్టబెట్టారని, మిగతా టెండర్ దారులు గొడవ చేయకుండా టెర్రాసాఫ్ట్ కంపెనీ వారికి ముడుపులు ఇచ్చిందని తెలిపారు.

Advertisement

Read More: కుర్చీ మడతపెడితే.. నారా లోకేశ్ మాస్ డైలాగ్..

ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కోగంటి సాంబశివరావు.. గతంలో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీగా, ఇన్ క్యాప్ వీసీ ఎండీగా వ్యవహరించారు. ఆయన ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియను తారుమారు చేశారని, టెండర్లు ముగిసే రోజున బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెరాసాఫ్ట్ ను లిస్టులో నుంచి తొలగించి, టెండర్ ను ఆ కంపెనీకి కట్టబెట్టారని పేర్కొన్నారు. ఫైబర్ నెట్ లో మొత్తం రూ.330 కోట్ల వరకూ మేలు జరిగేలా అధికారులు వ్యవహరించారని సీఐడీ ఆరోపించింది.

Advertisement

ఇందులో టెరామీడియా క్లౌడ్ కంపెనీకి అనుబంధం ఉందని, హరికృష్ణప్రసాద్ భాగస్వామి అని, చంద్రబాబు చెప్పినట్లే ఆయన చేశారన్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ సీనియర్ అధికారులను కోర్టుముందు ప్రవేశపెట్టామన్న సీఐడీ .. ఆ తర్వాత స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు తెలిపింది. అలాగే ఫైబర్ నెట్ కేసులో ఆయన్ను విచారించేందుకు అనుమతివ్వాలని పీటీవారెంట్ ను దాఖలు చేసినట్లు చెప్పిందది. ప్రస్తుతం ఈ రెండు కేసులో ఏసీబీ కోర్టులో ఉండగా.. బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు, హైకోర్టు తోసిపుచ్చడంతో.. సుప్రీంకోర్టులో లీవ్ పిటిషన్ పెట్టుకున్నారని, అది పెండింగ్ లో ఉందని సీఐడీ చార్జిషీటులో తెలిపింది.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×