E-Paper
Advertisement

YSRCP 7th List: వైసీపీ ఏడో జాబితా విడుదల.. ఆమంచికి షాక్!

YSRCP 7th List: వైసీపీ ఏడో జాబితా విడుదల.. ఆమంచికి షాక్!
Advertisement
YSRCP Party latest news

YSRCP 7th List Released: వైఎస్సార్సీపీ అధిష్ఠానం.. విడతల వారీగా నియోజకవర్గాల ఇన్ చార్జిలను ప్రకటిస్తూ వస్తోంది. ఇప్పటికే 6 జాబితాలను ప్రకటించిన అధిష్ఠానం.. తాజాగా ఏడవ జాబితాను రిలీజ్ చేసింది. ప్రకాశం జిల్లా పర్చూరు ఇంచార్జిగా యడం బాలాజీని ప్రకటించింది. కందుకూరు ఇంచార్జిగా కటరీ అరవింద యాదవ్ ను ప్రకటించారు. ఇప్పటి వరకు విడుదల చేసిన జాబితాలలో.. 69 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు , 16 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. అందులో 33 మంది సిట్టింగులకు మొండి చెయ్యి చూపించారు. తాజాగా విడుదల చేసిన ఏడో జాబితాలో.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరో ఇద్దరు సీనియర్ నేతలకు జగన్ షాకిచ్చారు. కందుకూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి, పరుచూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి బాధ్యతల నుంచి తప్పించి, ఆమంచి కృష్ణమోన్ కు టికెట్లు నిరాకరించారు.

తొలి నుంచీ ఇదే అనుకుంటున్నప్పటికీ.. శుక్రవారం రాత్రి పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటిచింది. ఇద్దరి పేర్లతో ఏడవ లిస్ట్ ను విడుదల చేయగా.. కందుకూరులో తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన పెంచలయ్య కుమార్తె అరవింద యాదవ్ ను ఇన్ చార్జిగా నియమించారు. పరచూరు బాధ్యతల నుంచి ఆమంచిని తప్పించి.. చీరాలకు చెందిన యడం బాలాజీని ఇన్ చార్జిగా నియమించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో చీరాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బాలాజీకి.. 2019లో పార్టీ టికెట్ అవ్వకపోవడంతో టీడీపీలో చేరారు.

Advertisement

Read More:  ఏపీ పోలీసులపై షర్మిల మండిపాటు.. సత్తెనపల్లి ఘటనపై వెంటనే స్పందించాలని డిమాండ్

ఇప్పుడు అమెరికాలో ఉంటున్న ఆయనను సీఎం జగన్.. పిలిపించుకుని మరీ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం గమనార్హం. ఆ వెంటనే పర్చూరు బాధ్యతలను అప్పగించారు. తనను పక్కనపెట్టి మరీ.. యడం బాలాజీకి బాధ్యతలు అప్పజెప్పడంతో.. ఆమంచి అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఆమంచిని పక్కనపెట్టడంపై వైసీపీలో ఉన్న నేతలే పెదవి విరుస్తున్నారు.

Advertisement

కాగా.. నియోజకవర్గాల ఇన్చార్జిల తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్చార్జిలను నియమించగా.. 2వ జాబితాలో 3 ఎంపీ, 24 అసెంబ్లీ స్థానాలకు, మూడవ జాబితాలో 6 ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాలకు, 4వ లిస్టులో 1 ఎంపీ, 8 అసెంబ్లీ స్థానాలకు, 5వ జాబితాలో 3 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలకు, 6వ లిస్టులో 4 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాలకు ఇన్చార్జిలను ప్రకటించింది వైసీపీ అధిష్ఠానం. తాజాగా 7వ జాబితాలో రెండు అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్చార్జిలను ప్రకటించింది.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×