E-Paper
Advertisement

Guntur: గుంటూరులో అర్ధరాత్రి యువకుల వీరంగం.. నడిరోడ్డుపై పొట్టుపొట్టు కొట్టుకున్న బావ-బామ్మర్దులు

Guntur: గుంటూరులో అర్ధరాత్రి యువకుల వీరంగం.. నడిరోడ్డుపై పొట్టుపొట్టు కొట్టుకున్న బావ-బామ్మర్దులు
Advertisement

Guntur: గుంటూరు నగరంలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై బావ, బామ్మర్దులు ఒకరిపై ఒకరు పొట్టుపొట్టు కొట్టుకున్నారు. అయితే సాధారణంగా కుటుంబ కలహాలు ఇంటి నాలుగు గోడల మధ్య సర్దుమణిగిపోతాయి, కానీ ఇక్కడ మాత్రం పాత కక్షలు, వ్యక్తిగత విబేధాలు రోడ్డుపైకి వచ్చి బహిరంగ ఘర్షణకు దారితీశాయి. నిశ్శబ్దంగా ఉన్న నగరం ఒక్కసారిగా ఈ అరుపులు, కేకలతో ఉలిక్కిపడింది.

ఈ గొడవకు ప్రధాన కారణం కుటుంబ సమస్యలేనని తెలుస్తోంది. తన అక్కను బావ వేధిస్తున్నాడనే ఆగ్రహంతో ఉన్న బామ్మర్ది, తన స్నేహితులతో కలిసి పక్కా పథకం ప్రకారం ఈ దాడికి పాల్పడ్డాడు. బావ ఒంటరిగా దొరికిన సమయం చూసి బామ్మర్ది గ్యాంగ్ ఒక్కసారిగా విరుచుకుపడింది. పిడిగుద్దులు, కర్రలతో పరస్పరం దాడి చేసుకోవడంతో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కపై ఉన్న ప్రేమ, బావపై ఉన్న కోపం వెరసి ఒక హింసాత్మక ఘటనగా జరిగింది.

Advertisement

Also Read: భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ పరిశ్రమలో చెలరేగిన మంటలు, ఎగిసిపడుతున్న పొగ

సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నడిరోడ్డుపై ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దాడుల్లో పాల్గొన్న యువకులను గుర్తించే పనిలో పడ్డారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×