E-Paper
Advertisement

Guntur : గుంటూరు జిల్లాలో సీఎం ఫ్లెక్సీ కలకలం.. పలువురు అరెస్ట్..

Guntur : గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ వల్ల వివాదం చోటు చేసుకుంది. ‘పోరంబోకు భూమిని కాపాడు జగనన్నా’ అంటూ వైకాపా నేత చల్లా అచ్చిరెడ్డి పేరుతో నల్లపాడులో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం తీవ్ర ఉద్రిక్తత సృష్టించింది.

Guntur : గుంటూరు జిల్లాలో సీఎం ఫ్లెక్సీ కలకలం.. పలువురు అరెస్ట్..
Advertisement

Guntur : గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ వివాదాస్పదం అయ్యింది. ‘పోరంబోకు భూమిని కాపాడు జగనన్నా’ అంటూ వైసీపీ నేత చల్లా అచ్చిరెడ్డి పేరుతో నల్లపాడులో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం తీవ్ర ఉద్రిక్తత సృష్టించింది. ఆడుదాం ఆంధ్ర ప్రారంభోత్సవానికి మంగళవారం సీఎం జగన్‌ నల్లపాడుకు వచ్చారు. జగన్‌ పర్యటనను స్థానిక యువత, విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘ఆడుదాం ఆంధ్ర సరే ..ఆట స్థలాలు ఎక్కడ’’ అని నినాదాలు చేస్తూ గుంటూరు చుట్టుగుంట జంక్షన్ లో ఆందోళనకు దిగారు.

రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. అందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో క్రీడా పోటీలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్‌ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని నల్లపాడులోని లయోలా పబ్లిక్‌ స్కూల్‌లో ప్రారంభించారు. మంగళవారం నుంచి ఫిబ్రవరి 10 వరకు మొత్తం 47 రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఆడుదాం ఆంధ్ర పేరిట నిర్వహించే ఈ పోటీలలో క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ మొదలైన ఆటలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Tags

Related News

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Big Stories

Advertisement
×