BigTV English

Godavari Flood News: లంక గ్రామాలకు ముంపు ముప్పు.. గోదావరి ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక..

Godavari Flood News: లంక గ్రామాలకు ముంపు ముప్పు.. గోదావరి ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక..
Godavari flood latest news telugu

Godavari flood latest news telugu(Telugu flash news): గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. తెలంగాణతోపాటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం వద్ద వేద భారతి పీఠం శివలింగాలు నీటమునిగాయి. బాసర మండలంలోని బిద్రేల్లి వద్ద వరద ఉద్ధృతికి బైంసా-నిజామాబాద్ జాతీయ రహదారి కోతకు గురైంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులు దాటింది.


ఏలూరు జిల్లాలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి బాధితులను అధికారులు బోట్ల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గోదావరి బేసిన్ ఎగువ పరీవాహక ప్రాంతాలు కుక్కునూరు, వేలేరుపాడు మండల పరిసరాల్లో లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. బ్యారేజీ వద్ద గంట గంటకు నీటిమట్టం పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 14.30 అడుగులకు చేరుకుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు.


అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పరిధిలోని లంక గ్రామాల ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నారు. ముమ్మిడివరం మండలంలో 10, ఐ. పోలవరం మండలంలో 12, కాట్రేనికోన మండలంలో 4, తాళ్లరేపు మండలంలో 4 లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఈ 30 గ్రామాలు ముంపు బారిన పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

గౌతమి గోదావరిలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంది. రాజోలు పరిధిలోని వశిష్ఠ గోదావరికి భారీగా వరద ప్రవాహం పెరుగుతోంది. కొత్తలంక కాజ్‌వే పైకి వరద నీరు చేరింది. దీంతో లంకగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అప్పనపల్లి వద్ద వైనతేయ నదీపాయ కాజ్‌వే పైకి వరద ప్రవాహం చేరింది.

Related News

Visakha Heavy Rains: వాయుగుండం ఎఫెక్ట్.. విశాఖలో భారీ వర్షాలు, గాలుల బీభత్సం

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Big Stories

×