BigTV English

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Onion Farmers: కర్నూలు జిల్లా ఉల్లి రైతులు గిట్టుబాటు ధరలు లేక.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఆస్పరి మండలం యాటకల్లు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే రైతు..  రెండు ఎకరాలలో ఉల్లి పంట సాగు చేశాడు. ఈ పంటపై ఆయన సుమారు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టినా, మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశాడు. తాము ఆశించిన మద్దతు ధర లభించకపోవడంతో.. కష్టపడి పండించిన ఉల్లిని  వాగులో పారేయాల్సిన పరిస్థితి నెలకొంది.


ఉల్లికి గిట్టుబాటు ధర లేక రైతుల నిరాశ

రైతులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఒక క్వింటా ఉల్లికి కనీసం రూ.1200 మద్దతు ధర లభిస్తుందని ఆశించారు. అయితే ప్రభుత్వం ఆ మద్దతు ధరను రద్దు చేసి, హెక్టార్‌కు రూ.50 వేల రూపాయల సహాయం అందిస్తామని ప్రకటించింది. కానీ ఈ విధానం రైతులకు సరైన ఉపయోగం కలిగించడం లేదని వారు అంటున్నారు. ఎందుకంటే ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న సమయంలో.. పంటకు కనీస ధర లేకపోవడంతో పెట్టుబడులు తిరిగి రాకుండా పోతున్నాయి.

పెట్టుబడులు వృథా 

రైతులు కష్టపడి పండించిన ఉల్లిని మార్కెట్లో విక్రయించలేక, పొలాల పక్కనే ఉన్న వాగులో పారేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఉల్లి బస్తాలను చూసి జనం బారులు తీరుతున్నారు.


కూలీల ఖర్చులు భారంగా

ఉల్లి పంటలో ఎక్కువ శ్రమ అవసరం ఉంటుంది. సాగు మొదలుపెట్టినప్పటి నుంచి కోత వరకు.. భారీగా కూలీలపై ఆధారపడాల్సి వస్తోంది. కూలీల ఖర్చులు పెరగడంతో రైతులపై అదనపు భారమైంది. పెట్టుబడి వసూలు కావడమే కాకుండా నష్టాలను మోయాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వంపై రైతుల ఆవేదన

ప్రతి ఏటా ఉల్లి పండించినా గిట్టుబాటు ధర కల్పించడంలేదని.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు ఉల్లికి దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ, సరైన ధర రాకపోవడం రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోందని వారు చెబుతున్నారు. మహారాష్ట్రలో ఉల్లి ఉత్పత్తిని నియంత్రించడానికి చర్యలు తీసుకుంటారు, కానీ కర్నూలు రైతులను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read: పసిడి పరుగో పరుగు.. గోల్డ్ రేట్ @2 లక్షలు

రైతుల డిమాండ్

మాకు కనీసం రూ.1200 మద్దతు ధరను కల్పించాలి. లేకపోతే ఉల్లి పంటను సాగు చేయలేమని వారు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ, తమ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Related News

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

AP Heavy Rains: ఏపీకి అల్పపీడనం ముప్పు.. భారీ వర్షాలు పడే అవకాశం, రెడీగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్

Anam Fires On YS Sharmila: ఆలయాలకు బదులుగా టాయిలెట్స్.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఆగ్రహం

CM Chandrababu: ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్దిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే స్వర్ణాంధ్ర లక్ష్యం: సీఎం చంద్రబాబు

AP Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. మత్స్యకారులకు అలర్ట్

Big Stories

×