E-Paper
Advertisement

Rains In Andrapradesh: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో భారీ వ‌ర్షాలు..ఈ రెండు జిల్లాల‌కు అల‌ర్ట్

Rains In Andrapradesh: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో భారీ వ‌ర్షాలు..ఈ రెండు జిల్లాల‌కు అల‌ర్ట్
Advertisement

Rains In Andrapradesh: బంగాళాఖాతంలో ఏర్ప‌డిన వాయుగుండం తీవ్ర‌వాయుగుండంగా మారుతోంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించింది. దీనివ‌ల్ల ఏపీలో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రించింది. ఇప్ప‌టికే త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడులోని ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు కుర‌వ‌డంతో అక్క‌డి ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. మ‌రోవైపు ఏపీ తీర ప్రాంతాల్లోనూ ఈదురుగాలులు వీస్తున్నాయి. అంతే కాకుండా ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.

Also Read: స్వయంగా నేనే చర్యలు తీసుకుంటా.. కాళేశ్వరం విచారణలో చీఫ్ జస్టిస్ చంద్రఘోష్

Advertisement

గూడూరు, అల్లూరు, కావ‌లి, ఆత్మ‌కూరు, సూలూరుపేట‌తో పాటూ మ‌రికొన్ని మండలాల్లో ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తున్నాయి. మ‌త్స్య‌కారులు ఎవ‌రూ చేప‌లవేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించింది. అన్ని పోర్టుల‌లో ఒక‌టో ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ చేశారు. మ‌రోవైపు రాబోయే 12 గంట‌ల్లో తుఫాన్ గా మారే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించింది. రెండు రోజుల్లో తుఫాన్ త‌మిళ‌నాడు, శ్రీలంక తీరాల‌పైపు క‌దిలే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. దీంతో రాబోయే 5 రోజులు ఏపీలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని హెచ్చ‌రించింది.

ముఖ్యంగా ద‌క్షిణ కోస్తా, ఉత్త‌ర‌కోస్తా, రాయ‌ల‌సీమ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది. అంతే కాకుండా ఈ రోజు నెల్లూరు, తిరుప‌తిలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. తుఫాన్ నేప‌థ్యంలో తిర‌పతిలో హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించారు. సూళ్లూరుపేట, గూడురు,నాయుడు పేట, తిరుపతి లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రేపు నెల్లూరు, తిరుప‌తి, చిత్తూరు జిల్లాల్లో ఒక‌టి రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ప్ర‌క‌టించింది. ప్ర‌కాశం, అన్న‌మ‌య్య‌, క‌డ‌ప జిల్లాల్లో ఒక‌టి రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది.

Related News

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Big Stories

Advertisement
×