E-Paper
Advertisement

AP News: భార్యను చంపేసి, దండేసి.. భర్త ఘాతుకం..

AP News: భార్యను చంపేసి, దండేసి.. భర్త ఘాతుకం..
Advertisement

AP News: అనుమానం.. దారుణానికి పురిగొల్పింది. బ్యూటీపార్లర్ నడుపుతున్న భార్య క్యారెక్టర్ ను శంకించాడు ఆమె భర్త. రోజూ అందంగా రెడీ అయి వెళుతుండటంతో మరింత అనుమానం పెంచుకున్నాడు. ఎవరితోనో ఏదో సంబంధం ఉందనే అపోహతో భార్యను వేధించడం మొదలుపెట్టాడు. వారిద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. అవి మరింతగా పెరిగాయి. ఆ భర్త ఉన్మాదిగా మారాడు. భార్యపై దారుణానికి తెగబడ్డాడు.

గుంటూరు జిల్లా తెనాలి, గాంధీనగర్‌లో జరిగిందీ దారుణం. కుటుంబ కలహాలతో భార్య గొంతుకోసి చంపేశాడు భర్తు. అనంతరం పూలదండ వేసి.. నివాళులు అర్పించి.. పోలీసులకు లొంగిపోవడం కలకలం రేపింది.

Advertisement

తెనాలికి చెందిన కోటయ్య, స్వాతి (31)లకు ఇద్దరు పిల్లలు. స్వాతి బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తోంది. కొంతకాలంగా ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు కోటయ్య. ఇదే విషయంలో రెండు రోజులుగా ఇద్దరి మధ్య బాగా గొడవ జరుగుతోంది. గురువారం మధ్యాహ్నం ఫుల్ గా మద్యం తాగిన కోటయ్య.. ఒక్కసారిగా సైకోగా మారాడు. భార్యను చంపాలని డిసైడ్ అయ్యాడు.

కత్తి, పూలదండ కొన్నాడు. భార్య నడిపిస్తున్న బ్యూటీ పార్లర్ కు వచ్చాడు. భార్యతో మరోసారి గొడవ పడ్డాడు. కోపంతో ఊగిపోతూ.. వెంట తెచ్చుకున్న కత్తితో భార్య మెడ, వీపు, చేతి భాగంలో విచక్షణారహితంగా దాడి చేశాడు. భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన స్వాతి.. స్పాట్ లోనే చనిపోయింది. బ్యూటీపార్లర్ అంతా రక్తపు మడుగుగా మారింది.

Advertisement

అక్కడితో ఆగలేదు ఆ ఉన్మాది భర్త. చనిపోయిన భార్యకు పూలదండ కూడా వేసి నివాళులు అర్పించాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి సరెండర్ అయ్యాడు. తెనాలిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Related News

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

Big Stories

Advertisement
×