E-Paper
Advertisement

PV Sunil kumar: IPS పీవీ సునీల్ కుమార్ ఆసక్తికర పోస్టు, తాను ఓకే.. ఆయన మాటేంటి?

PV Sunil kumar: IPS పీవీ సునీల్ కుమార్ ఆసక్తికర పోస్టు, తాను ఓకే.. ఆయన మాటేంటి?
Advertisement

PV Sunil kumar: ఐపీఎస్ పీవీ సునీల్‌కుమార్ పేరు చెప్పగానే ముందుగా రఘురామ కృష్ణంరాజు గుర్తుకొస్తారు. ఆయనపై రాజద్రోహం కేసులో సీఐడీ కస్టడీలో చిత్రహంసలకు గురి చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే రఘురామరాజు ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం రెండురోజుల ముందు ఆయన గుంటూరు పోలీసుల ముందు హాజరయ్యారు. దాదాపు నాలుగైదు గంటలపాటు ఆయన్ని పోలీసులు విచారించారు.

IPS పీవీ సునీల్ కుమార్ ఆసక్తికర పోస్టు

Advertisement

అధికారులు ఏ తరహా ప్రశ్నలు అడిగినా, తెలియదు, గుర్తులేదు అనే సమాధానంగా ఎక్కువగా వచ్చినట్టు చెప్పారట. విచారణకు హాజరైన ఆయన, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆసక్తి రేపుతోంది.  దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం తనను సస్పెండ్ చేశారు.. మంచిదే, మరి సమ న్యాయం కోసం రఘురామకృష్ణరాజు గారిని కూడా అన్ని పదవులనుండి సస్పెండ్ చేయాలి కదా? CBI దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయనను పదవుల నుండి తొలగించారని, చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ వెళ్ళాలన్నది ఆ పోస్టు సారాంశం.

ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్‌ సస్పెండ్ వెనుక అసలు కారణాలు చూద్దాం. అనుమతి లేకుండా పలుమార్లు  ఆయన విదేశీ పర్యటనలు చేయడమే అందుకు కారణం. నిబంధనలు ఉల్లంఘించడంతో విధులకు ఆయన్ని దూరంగా పెట్టింది కూటమి ప్రభుత్వం.

Advertisement

ఆయన మాటేంటి? సమ న్యాయం కోసం

ఇక డిప్యూటీ సీఎం రఘురామకృష్ణంరాజుకు వ్యవహారానికి వద్దాం. ఆయనకు ఓ కేసు విషయంలో సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇండ్ భారత్ సంస్ధ పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న కేసులో స్టే ఎత్తివేసింది. సీబీఐ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు నిందితులకు షోకాజ్ నోటీసు అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.

నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయలేమని చెప్పింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం కానుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండ్ భారత్ ధర్మల్ పవర్ సంస్థ పేరుతో రుణాలు తీసుకుని, వాటిని పక్కకు మళ్లించడం, వడ్డీ చెల్లించలేదని ఆ బ్యాంకు సీబీఐని ఆశ్రయించింది. అందులో రకరకాల అంశాలను ప్రస్తావించిన విషయం తెల్సిందే. ఆ కేసు నేపథ్యంలో పీవీ సునీల్‌కుమార్ ఈ విధంగా ఎక్స్‌లో పోస్టు పెట్టినట్టు చెబుతున్నారు.

ALSO READ:  గజ గజ వణుకుతున్న జనం..  మరో రెండురోజులు తప్పదా?

 

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×