BigTV English
Advertisement

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

IPS Secret Operation Fail: తప్పు చేసినవాడు.. ఎక్కడో దగ్గర దొరుకుతాడు.. నిందితుల విషయంలో పోలీసులు తరచు చెప్పేమాట. ఈ లాజిక్‌ను మరిచి పోయారు పైన కనిపిస్తున్న ముగ్గురు ఐపీఎస్‌లు. నిందితుల విషయంలో ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా గమనించే ఐపీఎస్‌లు.. సీక్రెట్ ఆపరేషన్‌లో ఎలా దొరికి పోయారు? ఒకరు డీఐజీ స్థాయి అధికారి కాగా, మరొకరు డీజీ ర్యాంకు, ఇంకొకరు ఐజీ ర్యాంకు అధికారి. వీరిలో ఒకరు అప్రూవర్‌గా మారిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై పోలీసు వర్గాల్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి.


ముంబై నటి వ్యవహారం తీగలాడితే డొంక కదులుతోంది. ఈ వ్యవహారంలో చాలా మంది పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత ఇద్దరు అధికారులు సస్పెండ్ కాగా, తాజా మరో ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల వంతైంది. ఈ జాబితాలో మరో నలుగురు అధికారులున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఐపీఎస్ అధికారులు సీక్రెట్‌గా సాగించిన ఈ ఆపరేషన్ ఎలా ఫెయిల్ అయ్యింది? అనేదానిపై రకరకాలు చర్చించుకుంటున్నారు.

ముంబై నటి వ్యవహారంపై ముగ్గురు ఐపీఎస్‌లు సీక్రెట్‌గా ఆపరేషన్ చేపట్టారు. ఈ విషయం మూడో కంటికి తెలీకుండా నడుపుకుంటూ వచ్చారు. ఆ తరహా పనులు చేయాలంటే.. ఉన్నతస్థాయి అధికారుల నుంచి పర్మీషన్ తీసుకోవాలి. అదీ చేయలేదు.. విమాన ఛార్జీలు సైతం సొంతంగానే పెట్టుకున్నారు. బిల్లుల క్లెయిమ్ చేయలేదు. సీక్రెట్ ఫండ్ నుంచి ఐపీఎస్‌లు మనీ తీసుకున్న సందర్భాలు లేవు. ఆ తరహా ఫండ్‌కు ఎలాంటి లెక్క ఉండదు. ఇదే వాళ్లని దోషులుగా చేసినట్టు కనిపిస్తోంది.


మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక్కరు మాత్రమే సీక్రెట్ ఫండ్‌ను ఉపయోగించినట్టు తెలుస్తోంది. దీంతో  అసలు గుట్టంతా బయటపడింది. ఈ ఎపిసోడ్ మొత్తం ఐపీఎస్ అధికారి ఆంజనేయుల చుట్టూ తిరుగు తోంది. ఐపీఎస్‌ల్లో ఒకరు అప్రూవర్‌గా మారినట్టు తెలుస్తోంది. దీంతో తీగలాగితే డొంక కదులుతోంది. అప్పటి మాజీ సలహాదారుడి మెడకు చుట్టుకునే అవకాశమున్నట్లు చిన్నపాటి చర్చ అప్పుడే మొదలైపోయింది.

ALSO READ: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు.  చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత  వీరికి దూరంగా పెట్టింది. ఈ వ్యవహారంపై మాజీ సీఎం జగన్, ప్రధాని మోదీకి సైతం లేఖ రాశారు. అయినా ఫలితం లేకపోయింది.

కొత్త ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్న కేసులకు ఆయా అధికారులకు అడ్డంకులు సృష్టిస్తున్నట్లు తేలింది. ప్రతీరోజూ డీజీపీ ఆఫీసు రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. వరదల నేపథ్యంలో ఆయా అధికారులు పత్తా లేకుండా పోయారు. సస్పెండయిన అధికారులకు కొద్దిరోజులుగా నిధుల సమస్య వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది సహాయం చేసినట్టు అంతర్గత సమాచారం.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×