BigTV English

Viveka Murder Case : వివేకా హత్య కేసు.. సీబీఐ దర్యాప్తు ముగిసిందా?

Viveka Murder Case : వివేకా హత్య కేసు.. సీబీఐ దర్యాప్తు ముగిసిందా?

Viveka Murder Case : వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగిసింది. మరి సీబీఐ దర్యాప్తును పూర్తి చేసిందా లేదా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దుపై వివేకా కుమార్తె సునీత గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జులై 3న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. అదేరోజు సుప్రీంకోర్టుకు వివేకా హత్య కేసు దర్యాప్తు పురోగతిని సీబీఐ వివరించనుంది. దర్యాప్తు ముగిసిందా..? విచారణ గడువు పెంచమని సీబీఐ కోరుతుందా ? ఈ విషయాలపై సందేహాలు ఉన్నాయి.

మరోవైపు నాంపల్లి సీబీఐ కోర్టులో వివేకా హత్య కేసుపై విచారణ జరిగింది. నిందితులు భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిను చంచల్‌గూడ జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న ఆరుగురు నిందితుల రిమాండ్‌ గడువు ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరిచారు.


ఇరుపక్షాల వాదనల విన్న నాంపల్లి కోర్టు నిందితుల రిమాండ్‌ను జూలై 14 వరకు పొడిగించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి అనుబంధ ఛార్జిషీట్‌ను న్యాయస్థానంలో సీబీఐ దాఖలు చేసింది. గతంలోనే దర్యాప్తు సంస్థ రెండు ఛార్జ్‌షీట్‌లు కోర్టుకు సమర్పించింది.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×