E-Paper
Advertisement

Viveka Murder Case : వివేకా హత్య కేసు.. సీబీఐ దర్యాప్తు ముగిసిందా?

Viveka Murder Case : వివేకా హత్య కేసు.. సీబీఐ దర్యాప్తు ముగిసిందా?
Advertisement

Viveka Murder Case : వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగిసింది. మరి సీబీఐ దర్యాప్తును పూర్తి చేసిందా లేదా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దుపై వివేకా కుమార్తె సునీత గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జులై 3న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. అదేరోజు సుప్రీంకోర్టుకు వివేకా హత్య కేసు దర్యాప్తు పురోగతిని సీబీఐ వివరించనుంది. దర్యాప్తు ముగిసిందా..? విచారణ గడువు పెంచమని సీబీఐ కోరుతుందా ? ఈ విషయాలపై సందేహాలు ఉన్నాయి.

Advertisement

మరోవైపు నాంపల్లి సీబీఐ కోర్టులో వివేకా హత్య కేసుపై విచారణ జరిగింది. నిందితులు భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిను చంచల్‌గూడ జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న ఆరుగురు నిందితుల రిమాండ్‌ గడువు ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరిచారు.

ఇరుపక్షాల వాదనల విన్న నాంపల్లి కోర్టు నిందితుల రిమాండ్‌ను జూలై 14 వరకు పొడిగించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి అనుబంధ ఛార్జిషీట్‌ను న్యాయస్థానంలో సీబీఐ దాఖలు చేసింది. గతంలోనే దర్యాప్తు సంస్థ రెండు ఛార్జ్‌షీట్‌లు కోర్టుకు సమర్పించింది.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×