Jagan on Ap Capital: ఏపీ రాజధాని అమరావతి బిల్లు బుధవారం లోకసభకు వచ్చింది. ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. అమరావతి విషయంలో గడిచిన ఏడేళ్లుగా టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. అంతేకాదు నిజంగా అమరావతి సెల్ఫ్ ప్రాజెక్టా అంటూ ప్రశ్నలు సంధించారు.
ఏపీ రాజధాని అమరావతి బిల్లు బుధవారం లోక్ సభలో కేంద్రం ప్రవేశ పెట్టింది. ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు తీర్మానం పేరిట ప్రభుత్వం ఎందుకు డ్రామాలు చేస్తోందని ప్రశ్నించారు. దాదాపు ఏడేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, లక్షల ఎకరాల్లో ఏయే నిర్మాణాలు చేపట్టారని ప్రశ్నలు సంధించారు.
సీఎం చంద్రబాబు చెబుతున్నట్టుగా అమరావతి సెల్ఫ్ ప్రాజెక్టా? మరి అమరావతి ఎంతవరకు వచ్చిందన్నారు. కనీసం భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా? మొదట తీసుకున్న 50 వేల ఏకరాల్లో కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజ్, వాటర్ సదుపాయాలకు ఎకరాకు రెండు కోట్లు అవుతుందని స్వయంగా సీఎం చంద్రబాబు వేసిన లెక్కల ద్వారా తెలుస్తుందన్నారు.
50 వేల ఎకరాలకు అయ్యే ఖర్చు అక్షరాలా లక్ష కోట్లని అన్నారు. దీనికే దిక్కులేదని అదనంగా మరో 50 వేల ఎకరాలు సేకరిస్తున్నారని అన్నారు. ఈ విధంగా అమరావతిని ఎందుకు పెంచాల్సి వస్తుందని ప్రశ్నలు లేవనెత్తారు. ఆ డబ్బులు ఎలా వస్తాయన్నారు. లక్ష ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం రెండు లక్షల కోట్లు అవుతుందన్నారు. ఈ డబ్బులు ఎలా వస్తాయని, ఎన్నోళ్లు పడుతుందన్నారు.
2019లో చూపించిన బాహుబలి సెట్టింగులతో వేసిన మాస్టర్ ప్లాన్, మళ్లీ ఎందుకు మారుస్తున్నారని లేవనెత్తారు. ఐదున్నర గంటలపాటు అమరావతిపై చర్చించిన ప్రభుత్వం, కేవలం జగన్, వైసీపీని దుమ్మెత్తిపోయడానికి, బూతులు తిట్టడానికి మాత్రమే ఉపయోగించుకున్నారని తేల్చిచెప్పారు.
రాష్ట్రాలకు రాజధాని గురించి రాజ్యాంగంలో లేదన్నారు. దేశానికి రాజ్యాంగం ఉంటుంది తప్పా, రాష్ట్రాలకు రాజధాని అనేది ఉండదన్నారు. సాక్షాత్తూ కేంద్రప్రభుత్వం కూడా రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అని తేల్చి చెప్పిందన్నారు. రాజధాని విషయంలో కేంద్రప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని అఫిడవిట్లో ఏపీ హైకోర్టులో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. జార్ఖండ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాలకు రాజధానుల విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయని, కేంద్రం నిర్ణయించలేదన్నారు.
అమరావతిలో రోడ్లు, డ్రైనేజీలకే ఎకరానికి రూ.2 కోట్లు అవుతుంది:మాజీ సీఎం జగన్
చంద్రబాబు లెక్కలే ఈ వివరాలు చెబుతున్నాయి
ఆ లెక్కన లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు కావాలి
రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి?
2019 ముందు మాస్టర్ప్లాన్ ఎందుకు మార్చుతున్నారు:మాజీ సీఎం జగన్
In… pic.twitter.com/Fok8Gjc0Eq
— BIG TV Breaking News (@bigtvtelugu) April 1, 2026