E-Paper
Advertisement

Amaravati: గొడ్డలి పార్టీ ఇష్యూ.. సీఎం చంద్రబాబుపై జగన్ ఎదురుదాడి, మా తాత, నాన్న, చిన్నాన్న ఏం చేశారు?

Amaravati: గొడ్డలి పార్టీ ఇష్యూ.. సీఎం చంద్రబాబుపై జగన్ ఎదురుదాడి, మా తాత, నాన్న, చిన్నాన్న  ఏం చేశారు?
Advertisement

Amaravati: ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయా? రానున్న రోజుల్లో హత్యల చుట్టూ కొత్త రాజకీయాలు రానున్నాయా? ఉన్నట్లుండి జగన్ పాత అంశాలపై తెరపైకి ఎందుకు తెచ్చారు? ప్రజల్లో తనపై సింపతీ క్రియేట్ చేసే పనిలో పడ్డారా? తనను తాను మంచోడ్ని అంటూ సర్టిఫికెట్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

సీఎం చంద్రబాబుపై విరుచుకుపడిన జగన్

Advertisement

సీఎం చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చీటికి మాటికి వైసీపీని గొడ్డలి పార్టీ అనడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్. అంతేకాదు పాత అంశాలపై తెరపైకి తెచ్చి మా ఫ్యామిలీలో జరిగిన పాత ఘటనలకు టీడీపీ రంగు పులుమే ప్రయత్నం చేశారు. గురువారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిదయ్యా హత్యా రాజకీయాల సంస్కృతి? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. మా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లే కదా అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు. వైఎస్ఆర్‌ను కేవలం పులివెందులకు కట్టడి చేయాలనేది ఆయన పథకంగా వర్ణించారు.

Advertisement

మా తాత..  నాన్న..  చిన్నాన్న ఏం చేశారు? అంటూ జగన్ ఎదురుదాడి

ఆ కేసుల్లో దోషుల్ని టీడీపీ ఆఫీసులో దాయలేదా? అధికారం దుర్వినియోగం చేసి వాళ్లని రక్షించిందెవరు?  ఎవరిది క్రిమినల్ బ్రెయిన్ అంటూ ప్రశ్నించారు. జగన్ మంచోడు కాబట్టే మా తాత రాజారెడ్డిని నరికి చంపిన వాళ్ళు ఇవాళ్టికీ బతికే ఉన్నారని అన్నారు. ఒకవేళ జగన్ చెడ్డోడయితే వాళ్ళంతా బతికి ఉండేవారా? అంటూ నిలదీశారు.

వైఎస్ఆర్ హెలికాప్టర్ ఘటనను టీడీపీపైకి నెట్టే ప్రయత్నం చేశారు జగన్. నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని సీఎం చంద్రబాబు మాట్లాడిన రెండు లేదా మూడు రోజులకే మా నాన్న(వైఎస్ఆర్) హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారని వివరించారు. దానికి సంబంధించి వీడియోలు ఉన్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మా చిన్నాన్న వివేకానంద‌రెడ్డి హత్యకు గురైందని వాస్తవం కాదా? అంటూ నిలదీశారు.

ALSO READ:  సీఎం చంద్రబాబుపై జగన్ హాట్ కామెంట్స్.. మరోసారి చావు పేరు ప్రస్తావన

చంద్రబాబు బావమరిది-వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకుని ఇద్దర్ని కాల్చిపడేయలేదా? అంటూ ప్రశ్నించారు. ప్రజలకు ఫలానా మంచి పని చేశానని సీఎం చంద్రబాబు చెప్పుకునే పరిస్థితి లేదన్నారు. రెండేళ్లు పాలన చూస్తే బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అనేది మాత్రమే కనిపించిందన్నారు.

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×